Virender Sehwag : కోహ్లీ, ధోనీ, రోహిత్ ముగ్గురిలో బెస్ట్ ఎవరు.. వీరేంద్ర సెహ్వాగ్ ఏం చెప్పాడంటే.. వీడియో వైరల్

ఇటీవల కాలంలో ర్యాపిడ్ ఆన్సర్ ఛాలెంజ్ ‘దిస్ ఆర్ దట్’ ట్రెండ్ గా మారింది. దిగ్గజ క్రికెటర్ల పేర్లు చెప్పి వారిలో ఒకరిని ఎంచుకునే ఛాలెంజ్ కు సెలబ్రిటీలు సమాధానం ఇస్తున్నారు.

Virender Sehwag

Virender Sehwag : ఇటీవల కాలంలో ర్యాపిడ్ ఆన్సర్ ఛాలెంజ్ ‘దిస్ ఆర్ దట్’ ట్రెండ్ గా మారింది. ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల పేర్లు చెప్పి వారిలో ఒకరిని ఎంచుకునే ఛాలెంజ్ కు సెలబ్రిటీలు సమాధానం ఇస్తున్నారు. తాజాగా ‘దిస్ ఆర్ దట్’ ఛాలెంజ్ లో టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ వీరేందర్ సెహ్వాగ్ పాల్గొన్నారు. ఢిల్లీలో ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నమెంట్ మ్యాచ్ సందర్భంగా స్టేడియానికి వచ్చిన సెహ్వాగ్ ను ర్యాపిడ్ ఆన్సర్ ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ ఇద్దరిద్దరు క్రికెటర్ల పేర్లను ఇచ్చి ఇందులో ఎవరు బెస్ట్ అంటూ సెహ్వాగ్ ప్రశ్నించింది. యాంకర్ అడిగిన ప్రశ్నలకు సెహ్వాగ్ ఏమాత్రం తడబాటు లేకుండా చకచకా చెప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : Shubman Gill : శుభ్‌మాన్ గిల్ బర్త్‌డే పార్టీ వీడియో వైరల్.. స్నేహితులతో కలిసి ఏం చేశాడో చూడండి..

ర్యాపిడ్ ఆన్సర్ ఛాలెంజ్ ‘దిస్ ఆర్ దట్’ లో మహేంద్ర సింగ్ ధోనీ, బెన్ స్టోక్స్ లో మీకు ఎవరు బెస్ట్ అని యాంకర్ ప్రశ్నించగా.. సెహ్వాగ్ వెంటనే ధోనీ అని చెప్పేశాడు. ధోనీ, ఏబీ డిలియర్స్ లో ఎవరు బెస్ట్ అని ప్రశ్నించగా.. దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కు సెహ్వాగ్ బెస్ట్ అని చెప్పాడు. ఏబీ డిలియర్స్ – విరాట్, పాట్ కమిన్స్ – విరాట్ కోహ్లీల్లో బెస్ట్ విరాట్ అని చెప్పేశాడు. ఆ తరువాత సెహ్వాగ్ కు టఫ్ ప్రశ్న ఎదురైంది. రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీలో ఎవరు బెస్ట్ అని ప్రశ్నించగా.. ఎలాంటి తడబాటు లేకుండా టీమిండియా, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ బెస్ట్ అని సెహ్వాగ్ తేల్చిపడేశాడు. ఆ తరువాత కూడా.. వార్నర్ -రోహిత్, స్టెయిన్ – రోహిత్ లలో రోహిత్ బెస్ట్ అంటూ సెహ్వాగ్ సమాధానం ఇచ్చారు. యాంకర్ రోహిత్ కు సంబంధించి అడిగిన అన్ని ప్రశ్నల్లో రోహితే బెస్ట్ అంటూ సెహ్వాగ్ చెప్పాడు. దీంతో ధోనీ, కోహ్లీ కంటే రోహిత్ బెస్ట్ ప్లేయర్ అని సెహ్వాగ్ క్లారిటీ ఇచ్చేశాడని రోహిత్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Also Read : ఎంఎస్ ధోని రికార్డును సమం చేసిన యంగ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్

మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ముగ్గురు భారత్ క్రికెట్ దిగ్గజాలు. ధోనీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా.. రోహిత్, కోహ్లీలు ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్నారు. వీరిద్దరూ భారత్ జట్టుకు విలువైన ప్లేయర్లు. రోహిత్, కోహ్లీల్లో మీకు ఎవరు గొప్ప అంటే ఎవరైనా చిన్నతడబాటుకు గురవుతారు.. కానీ, సెహ్వాగ్ మాత్రం రోహిత్ శర్మనే బెస్ట్ అంటూ తేల్చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు