Indian Railways
Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ట్రైన్ టికెట్ల కోసం ఆందోళన అక్కర్లేదు.. జెట్ స్పీడ్లో టికెట్ పొందవచ్చు. కొత్త బుకింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. తద్వారా టికెట్ పొందే సమయం మరింత తగ్గనుంది. అంతేకాదు.. మీకు కన్ఫార్మ్ అయిన సీటు పొందడంలో కూడా ఎలాంటి ఆలస్యం ఉండదు.
భారతీయ రైల్వేలు త్వరలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను అప్డేట్ చేయబోతున్నాయి. ఈ కొత్త PRS సిస్టమ్ అమల్లోకి వస్తే.. టికెట్ బుకింగ్ స్పీడ్ 4 రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం, నిమిషానికి తక్కువ టిక్కెట్లు బుక్ అవుతున్నాయి.
అదే కొత్త సిస్టమ్ వస్తే నిమిషానికి ఎక్కువ మొత్తంలో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ కొత్త సిస్టమ్ ఎప్పుడు వస్తుంది? ఎలా పనిచేస్తుంది? ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ కొత్త టికెట్ బుకింగ్ సిస్టమ్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పండుగలు, సెలవులు, రద్దీగా ఉండే సీజన్లలో ఎక్కువగా బెనిఫిట్స్ పొందవచ్చు. జట్ స్పీడ్లో ట్రైన్ టికెట్లను పొందవచ్చు అనమాట. సాధారణంగా ఇలాంటి సమయాల్లో ట్రైన్ టిక్కెట్లు పొందడం చాలా కష్టం.
అందుకే ఈ టెక్నాలజీ అప్గ్రేడ్ కోసం, రైల్వేలు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS)తో కలిసి పనిచేస్తున్నాయని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కుల్దీప్ తిరి చెప్పారు. అప్గ్రేడ్ ద్వారా హార్డ్వేర్, సాఫ్ట్వేర్, నెట్వర్క్, సెక్యూరిటీ మౌలిక సదుపాయాలు పూర్తిగా మార్చేస్తున్నారు.
ఈ కొత్త సిస్టమ్ క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. స్పీడ్ మాత్రమే కాదు.. చాలా సురక్షితం, సౌకర్యవంతంగానూ ఉంటుంది. ప్రస్తుత PRS సిస్టమ్ 2010లో ప్రారంభమైంది. పాత ఇటానియం సర్వర్, ఓపెన్ VMS ఆధారంగా రూపొందించారు. పెరుగుతున్న జనాభా, డిజిటల్ ట్రాఫిక్ దృష్ట్యా అప్గ్రేడ్ తప్పనిసరిగా మారింది.
మొబైల్ యాప్ రైల్ వన్ :
నవంబర్ 1, 2024 నుంచి భారత రైల్వేలు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP)ని 120 నుంచి 60 రోజులకు తగ్గించాయి. తద్వారా టికెట్ క్యాన్సిలేషన్ ఇష్యూ ఉండదు. రైల్వేలు ‘రైల్ వన్’ అనే కొత్త మొబైల్ యాప్ కూడా ప్రవేశపెట్టాయి.
ఈ యాప్ ద్వారా ప్రయాణీకులు తమ మొబైల్ నుంచి రిజర్వ్ చేసిన టికెట్, అన్ రిజర్వ్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీ ప్రయాణీకుల కోసం రైల్వేలు 2024-25 సంవత్సరంలో దూర ప్రాంతాలకు అనేక రైళ్లకు జనరల్ కోచ్లను కూడా చేర్చాయి.