Ration Card e-KYC
Ration Card e-KYC : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. మీ రేషన్ కార్డుకు ఈ-కేవైసీ చేయించుకున్నారా? లేదంటే ఇప్పుడే ఇ-కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేసుకోండి. ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే సమయం ఉంది. ఈ గడువు తేదీ దాటితే మీకు రావాల్సిన ఉచిత రేషన్ ఆగిపోతుంది.
ఆ తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత ప్రభుత్వం ప్రస్తుతం దేశీయ పౌరులకు సౌకర్యాలు కల్పించడానికి అనేక పథకాలను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పేద వర్గాలు, మహిళలు, రైతుల కోసం ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తెచ్చింది.
దేశంలోని కోట్లాది మందికి ప్రయోజనం చేకూరుస్తున్నాయి. చాలా మంది ఆహారం కోసం ప్రభుత్వంపై ఆధారపడి ఉన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం.. భారత ప్రభుత్వం ఈ ప్రజలకు ఉచిత రేషన్లను అందిస్తుంది. అదే సమయంలో, ప్రభుత్వం చాలా మందికి నామమాత్రపు ధరలకు రేషన్లను కూడా అందిస్తుంది. ఉచిత రేషన్ పొందాలంటే మీకు రేషన్ కార్డు తప్పక ఉండాలి.
మీరు రేషన్ కార్డుదారులైతే.. వెంటనే e-KYC చేయించుకోవాలి. ఎందుకంటే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. మీ పేరు రేషన్ కార్డు నుంచి పేరు తొలగిస్తారు. రేషన్ కార్డుదారులు ఏప్రిల్ 30 వరకు e-KYC చేసుకోవచ్చు. e-KYC కోసం రేషన్ దుకాణదారుడిని సంప్రదించండి. చాలా చోట్ల క్యాంపులను ఏర్పాటు చేయడం ద్వారా ఇ-కేవైసీ ప్రక్రియ జరుగుతోంది.
e-KYC తప్పనిసరి :
రేషన్ కార్డుకు సంబంధించిన సేవలను పొందడానికి e-KYC తప్పనిసరి. రేషన్ కార్డుదారుల E-KYC ప్రక్రియ వేగంగా జరుగుతోంది. రేషన్ కార్డుదారులలో 70 శాతం మంది e-KYC చేయించుకున్నారు.
చాలా మంది e-KYC చేయలేదు :
రేషన్ కార్డుదారులకు ఈ-కెవైసీ ప్రక్రియ 2024 సంవత్సరంలోనే ప్రారంభమైంది. ఇప్పటివరకు 10 లక్షల 19 వేల 242 మంది ఈ-కెవైసీ చేయించుకున్నారు. కానీ, ఇప్పటికీ 3 లక్షల 15 వేల 377 మంది ఈ-కెవైసీ చేయించుకోలేదు. మీరు ఈ-కెవైసీ చేయించుకోకపోతే వచ్చే నెల నుంచి మీకు ఉచిత రేషన్ అందకపోవచ్చు.
e-KYC ఎలా పూర్తి చేయాలి? :