Samsung Galaxy Tab S8 : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ సిరీస్ గెలాక్సీ ఎస్9ని ఈ ఏడాది జూలైలో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ స్మార్ట్ఫోన్ తయారీదారు గత ఏడాదిలో విడుదల చేసిన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 డివైజ్ ధరను మరింత తగ్గించింది.
Read Also : Samsung Galaxy A Series : శాంసంగ్ గెలాక్సీ A సిరీస్ ఫోన్లు లాంచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 మోడల్ వై-ఫై 5జీ అనే రెండు వేరియంట్లలో వస్తుంది. ఈ ఏడాది జూలైలో ఆండ్రాయిడ్ టాబ్లెట్ వై-ఫై వేరియంట్ ధర రూ. 8వేలు తగ్గింది. ఇప్పుడు 5జీ వెర్షన్ ధరను మరింత తగ్గించింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్8 128జీబీ 5జీ వేరియంట్ ధర రూ.4వేలు తగ్గింది. ఈ కొత్త ధర శాంసంగ్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 కొత్త ధర :
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 మోడల్ 128జీబీ 5జీ వేరియంట్ను రూ. 70,999 వద్ద లాంచ్ చేసింది. రూ. 4వేల ధర తగ్గింపు తర్వాత శాంసంగ్ నుంచి ఆండ్రాయిడ్ టాబ్లెట్ను రూ. 66,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. టాబ్లెట్ గ్రాఫైట్, సిల్వర్, పింక్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.
అంతేకాదు.. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 మోడల్ కొనుగోలుదారులకు శాంసంగ్ కొన్ని ఆఫర్లను కూడా అందిస్తోంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్లపై కస్టమర్లు రూ.7వేల ఇన్స్టంట్ డిస్కౌంట్లను పొందవచ్చు. నెలకు రూ. 5,552తో ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. కంపెనీ శాంసంగ్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్పై 10శాతం క్యాష్బ్యాక్ను కూడా అందిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ఫోన్ 2560×1600 పిక్సెల్ రిజల్యూషన్తో 11-అంగుళాల డబ్ల్యూక్యూఎక్స్జీఏ డిస్ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతున్న ఈ టాబ్లెట్లో క్వాల్కామ్ స్నాప్చాట్ చిప్సెట్ కలిగి ఉంది. 13ఎంపీ ప్రైమరీ సెన్సార్, 6ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ను అందిస్తుంది. వీడియో కాలింగ్ విషయానికి వస్తే.. 12ఎంపీ ఫ్రంట్ కెమెరా అందిస్తుంది. ఈ డివైజ్ 8000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.
Read Also : Poco C65 Launch : అదిరే ఫీచర్లతో పోకో C65 ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 15నే లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?