Hyderabad : నగరంలో అర్ధరాత్రి దారుణం.. యువ‌కుడిపై దాడి

మెహదీపట్నంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నాగార్జున అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి నగదు, సెల్ ఫోన్ దోచుకెళ్లారు

Hyderabad : మెహదీపట్నంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నాగార్జున అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి నగదు, సెల్ ఫోన్ దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే నాగార్జున తన తల్లికి మందులు తీసుకెళ్లేందుకు నగరానికి వచ్చాడు.

చదవండి : Hyderabad : విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు కూలీలు మృతి

ఆదివారం రాత్రి ఎల్బీనగర్ నుంచి మెహదీపట్నం చేరుకొని అటునుంచి ఓయూ కాలానికి వెళ్లేందుకు ఆటోను ఎక్కాడు. అప్పటికే ఆటోలో ఇద్దరు యువకులు ఉన్నారు. అయితే ఇదే సమయంలో డ్రైవర్ ఆటోను దారి మళ్ళించాడు.

దీంతో నాగార్జున ఈ రూట్ లో ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించాగా.. ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు కత్తులతో అతడిని బెదిరించారు. అరిస్తే పొడిచేస్తామని భయపెట్టారు. కత్తులు చూపించడంతో నాగార్జున భయపడిపోయాడు.. ఆటో సన్ సిటీ దాటిన తర్వాత ఆపి.. నాగార్జునపై దాడిచేసి గాయపరిచారు.

చదవండి : Hyderabad : విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు కూలీలు మృతి

అతడివద్ద ఉన్న రూ. 3,000 నగదు. రూ.20వేల విలువచేసే ఫోన్ లాక్కెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు