Hyderabad : విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు కూలీలు మృతి
సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం స్థానికులు ఓ ప్రైవేట్ సంస్థను సంప్రదించారు. ఇద్దరు కూలీలు అక్కడికి వెళ్లి.. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా..ఊపిరి అందక మృతి చెందారు.
Hyderabad : హైదరాబాద్ నగరంలోని కొండాపూర్లో ఘోర విషాదం జరిగింది. గౌతమి ఎన్ క్లేవ్ పరిధిలో ఉన్న హేమదుర్గ అపార్ట్మెంట్లో.. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం స్థానికులు ఓ ప్రైవేట్ సంస్థను సంప్రదించారు. ఇద్దరు కూలీలు అక్కడికి వెళ్లి.. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా.. ఉన్నపాటుగా ఊపిరి అందక ఇబ్బంది పడ్డారు.
చదవండి : Young Woman Died : విహారంలో విషాదం-కారులోంచి తల బయటపెట్టటంతో ప్రాణమే పోయింది
పరిస్థితి చేజారి.. మరణించారు. వారిని నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ఘాజీనగర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారు సైదాబాద్లోని సింగరేణి కాలనీలో నివాసం ఉంటున్నారని తెలిపారు. విషవాయువుల కారణంగా ఈ దారుణం జరిగిందని వివరించారు. కూలీలా మృతితో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.
చదవండి : West Bengal Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి