Bandi Sanjay: వెంటనే ఈ వ్యాపారాలను ఆపాలి: కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ

Telangana: "మీ రియల్ ఎస్టేట్ దందాలకు దళితుల, గిరిజనుల భూములను గుంజుకుంటారా" అని బండి సంజయ్ ప్రశ్నించారు.

Bandi Sanjay

Telangana: దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలను ఆపాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR )కు బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ లేఖ రాశారు. ఎన్నో ఏళ్ల క్రితం దళితులకు, గిరిజనులకు అసైన్‌ చేసిన భూములను లాక్కుంటూ రియల్‌ వ్యాపారం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.

“ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం అంటే వారి నోటి కాడి ముద్ద లాక్కోవడమే. దళితులకు మూడు ఎకరాల సాగుభూమి ఇస్తామన్న హామీని వమ్ము చేసి దళితులు మోసం చేశారు. ఇదిగో… అదిగో పోడు భూములకు పట్టాలిస్తాం… అంటూ హామీలివ్వడవ్వమే తప్ప అమలేది?

మీ రియల్ ఎస్టేట్ దందాలకు దళితుల, గిరిజనుల భూములను గుంజుకుంటారా? దళిత, గిరిజనులంటే మీకెందుకు అంత కక్ష? బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు రక్షణ కరవైంది. దళితులు, గిరిజనుల బతుకులను ఆగం చేసే చర్యలను ప్రభుత్వం వెంటనే విడనాడాలి. అసైన్డ్‌ భూముల్లో రియల్‌ దందాకు తెరదించకుంటే బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన పెద్దఎత్తున ఆందోళన చేపడతాం” అని బండి సంజయ్ లేఖలో చెప్పారు.

YS Sharmila : ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారు : వైఎస్ షర్మిల