కవితను అరెస్టు చేస్తామని ఎప్పుడూ అనలేదు.. సీబీఐ, ఈడీతో బీజేపీకి సంబంధం లేదు : బండి సంజయ్

బీఆర్ఎస్, కాంగ్రెస్ పొద్దంతా ప్రగల్భాలు పలికి రాత్రంతా ఒప్పందాలు చేసుకుంటారు. గతంలో కలిసి పోటీ చేసిన పార్టీలు ఆ రెండే.

Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar : సీబీఐ, ఈడీకి బీజేపీకి సంబంధం లేదు. వాటిని శాశించే అధికారం మా పార్టీకి గానీ, కేంద్రానికి గానీ లేవు. అలాంటి ఆలోచన లేదు. అవి స్వతంత్ర సంస్థలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ నియోజకవర్గంలో రెండో విడత ప్రజాహిత యాత్రలో సంజయ్ పాల్గొన్నారు. తొలత కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కవితను అరెస్టు చేస్తామని ఎప్పుడు అనలేదు. తప్పుచేసిన వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటారని సంజయ్ అన్నారు.

Also read : Rythu Bharosa: రైతు భరోసా అమలుకు తెలంగాణ సర్కారు ద్విముఖ వ్యూహం!

ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు..
బీఆర్ఎస్, కాంగ్రెస్ పొద్దంతా ప్రగల్భాలు పలికి రాత్రంతా ఒప్పందాలు చేసుకుంటారు. గతంలో కలిసి పోటీ చేసిన పార్టీలు ఆ రెండే. మేము ఎవరితో కలవలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యారు. ఇద్దరు కలిసే మోడీని ఓడించడానికి, రాష్ట్రపతిని ఓడించేందుకు ప్రయత్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరని బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ప్రచారమే చేశారు. మేము, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశామా? అంటూ సంజయ్ ప్రశ్నించారు. ఐదారు రోజుల్లో తెలంగాణలో వీలైనన్ని ఎంపీ సీట్లుకు మా కేంద్ర నాయకత్వం అభ్యర్థులను ప్రకటించబోతుంది. ఇంకా పొత్తెక్కడిది. బీఆర్ఎస్ తో పొత్తు అని ఎవరైనా అంటే చెంపలు వాయించమని మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు. నేను చెప్పుతో కొట్టమని చెప్పానంటూ సంజయ్ అన్నారు.

Also Read : 10మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ రెడీ? ఎంపీ అభ్యర్థులు వీళ్లే?

వినోద్ కుమార్ మూడో స్థానమే ..
బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు ఈసారి కరీంనగర్ లో మూడో స్థానం ఖాయమని సంజయ్ జోస్యం చెప్పారు. ఆయన కరీంనగర్ కు ఏం చేశాడు. కనీసం పార్టీ క్యాడర్ నుకూడా గుర్తుపట్టడు. ఆయనే పోటీకి వెనకాముందు ఆడుతున్నాడు. నామీద గెలుస్తడా? దేశ, రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలను ప్రజాహిత యాత్రలో ప్రస్తావిస్తాం. వేములవాడ, కొండగట్టు అభివృద్ధికి రాష్ట్రం నిధులు విడుదల చేయాలి. తన వంతుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత నాదని సంజయ్ అన్నారు. కాంగ్రెస్, మేము కలిసి దేవాలయాలను అభివృద్ధి చేస్తాం. గత ప్రభుత్వం మూర్ఖ ప్రభుత్వం కాబట్టి అభివృద్ధి చేయలేదని సంజయ్ విమర్శించారు.

Also Read : GHMC Deputy Mayor : బీఆర్ఎస్‌కు గట్టి షాక్.. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌రెడ్డి రాజీనామా

హైదరాబాద్ పార్లమెంట్ కూడా గెలుస్తాం..
కిషన్ రెడ్డి యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో హైదరాబాద్ సహా 17 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని బండి సంజయ్ దీమా వ్యక్తం చేశారు. రామరాజ్యం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు.. ఇవి మోదీ ఎన్నికలు. ఆయన్ను గెలిపించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. 370 సీట్లకుపైగా గెలవాలని మా కేంద్ర నాయకత్వం ఆలోచన నిజం కాబోతోంది. ప్రజాహిత రెండో విడత ప్రారంభిస్తున్నా.. మొదటి విడతల్లో వేములవాడ, సిరిసిల్ల పూర్తయింది. నేటి నుంచి హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు, కరీంనగర్ నియోజకవర్గాల్లో నా యాత్ర సాగుతుంది. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాని మంత్రిని చేయాలన్న లక్ష్యంతోనే ఈ యాత్ర అని బండి సంజయ్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు