CM KCR : సీఎం కేసీఆర్ కు ఈసీ నోటీసులు.. ప్రజలను రెచ్చ గొట్టే విధంగా ప్రసంగించొద్దని హెచ్చరిక

బాన్సువాడ పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అంటూ స్పష్టం చేసింది.

CEC notices to CM KCR

CEC notices to CM KCR : బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. సభల్లో ప్రజలను రెచ్చ గొట్టే విధంగా ప్రసంగించవద్దని హెచ్చరించింది. గత నెల (అక్టోబర్ 30న) బాన్సువాడ పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయనకు ఈసీ నోటీసులు పంపింది.

మంత్రి కేటీఆర్ కు ఈసీ నోటీసులు..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రాజకీయ కార్యకలాపాల కోసం ప్రభుత్వ ఆఫీసు టీ వర్క్స్ ను వాడుకున్నారని కాంగ్రెస్ నేత ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈసీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు పంపింది. కేటీఆర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాలు వ్యక్తం చేసింది.

Rahul Gandhi : కేసీఆర్ పదేళ్ల పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం : రాహుల్ గాంధీ

ఆదివారం మధ్యాహ్నం 3 గంటల కల్లా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రణ్ దీప్ సూర్జేవాలా ఫిర్యాదు చేయడంతో ఈసీ కేటీఆర్ కు నోటీసులు పంపింది. టీవర్క్స్ లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్ కార్యక్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సూర్జేవాలా ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ నోటీసులు పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని టీవర్క్స్ భేటీలో విద్యార్థులకు కేటీఆర్ హామీ ఇచ్చారని సూర్జేవాలా ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కూడా చెప్పారని తద్వారా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్ ను ఉపయోగించుకున్నారని ఫిర్యాదులో వెల్లడించారు.

Amit Shah : బీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లే : అమిత్ షా

సూర్జేవాలా ఫిర్యాదును పరిశీలించిన ఈసీ.. కేటీఆర్ ప్రాథమిక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ కు ఈసీ నోటీసులు పంపింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల కల్లా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు