CM KCR appointed TRS presidents : టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు అధ్యక్షుల్ని నియమించారు. 19మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు జడ్పీ ఛైర్మన్లకే కేసీఆర్ జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాకు జోగు రామన్న, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు కోనేరు కోనప్ప, మంచిర్యాల జిల్లాకు బాల్క సుమన్, నిర్మల్ జిల్లాకు విఠల్ రెడ్డిని అధ్యక్షులుగా నియమించారు.
నిజామాబాద్ జిల్లా బాధ్యతలను ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అప్పగించారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ ముజీబుద్దీన్ని నియమించారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సుడా ఛైర్మన్ జి.వి. రామకృష్ణారావుని నియమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎంపీపీ తోట ఆగయ్యకు అప్పగించారు. ఎమ్మెల్యే కె.విద్యాసాగర్ రావు జగిత్యాల జిల్లా బాధ్యతలు చూస్తారు. పెద్దపల్లి జిల్లా బాధ్యతలను కోరుకంటి చందర్కు అప్పగించారు.
Ap New Districts : ఏపీలో 26 జిల్లాలు.. ముఖ్యపట్టణాలు, నియోజకవర్గాల వివరాలు
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకం
ఆదిలాబాద్ జిల్లా – జోగు రామన్న
ఆదిలాబాద్-జోగు రామన్న, ఆసిఫాబాద్-కోనేరు కోనప్ప
మంచిర్యాల-బాల్క సుమన్, నిర్మల్-విఠల్రెడ్డి
నిజామాబాద్-జీవన్రెడ్డి, కామారెడ్డి-ముజీబుద్దీన్
కరీంనగర్-రామకృష్ణారావు, సిరిసిల్ల-తోట ఆగయ్య
జగిత్యాల-కె.విద్యాసాగర్రావు, పెద్దపల్లి-కోరుకంటి చందర్
మెదక్-పద్మాదేవేందర్రెడ్డి, సంగారెడ్డి-చింతా ప్రభాకర్
సిద్దిపేట-కొత్త ప్రభాకర్రెడ్డి, వరంగల్-ఆరూరి రమేశ్
కొత్తగూడెం-రేగా కాంతారావు, నల్లగొండ-రవీంద్రకుమార్
సూర్యాపేట-బడుగుల లింగయ్య, యాదాద్రి-కంచర్ల రామకృష్ణారెడ్డి
రంగారెడ్డి-మంచిరెడ్డి కిషన్రెడ్డి, వికారాబాద్-డా.మెతుకు ఆనంద్
మేడ్చల్-ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
మహబూబ్నగర్-ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి
నాగర్కర్నూలు-ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
జోగులాంబ గద్వాల-ఎమ్మెల్యే బి.కృష్ణమోహన్రెడ్డి
నారాయణపేట-ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి
వనపర్తి-మున్సిపల్ చైర్మన్ ఏర్పుల గట్టుయాదవ్
హైదరాబాద్-ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్