Ap New Districts : ఏపీలో 26 జిల్లాలు.. ముఖ్యపట్టణాలు, నియోజకవర్గాల వివరాలు

కొత్తగా ఏర్పడే మన్యం జిల్లాలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు కలిపి మొత్తం 4 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు పాలకొండ(6),పార్వతీపురం(10) కలిపి మొత్తం 16 మండలాలు ఉన్నాయి.

Ap New Districts : ఏపీలో 26 జిల్లాలు.. ముఖ్యపట్టణాలు, నియోజకవర్గాల వివరాలు

Ap Districts

Ap New Districts : ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 13 జిల్లాలతో కలిపి 26 జిల్లాలు కానున్నాయి. 1974 ఏపీ జిల్లాల చట్టం ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. చట్టానికి అనుగుణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీసీఎల్ఏ ప్రాథమిక నోటిఫికేషన్‌ రూపొందించింది. శ్రీకాకుళం కేంద్రంగా శ్రీకాకుళం జిల్లా, విజయనగరం కేంద్రంగా విజయనగరం జిల్లా, పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా, పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా, కాకినాడ కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా, రాజమహేంద్రవరం కేంద్రంగా రాజమహేంద్రవరం జిల్లా, భీమవరం కేంద్రంగా నరసాపురం జిల్లా ఏర్పాటు కానున్నాయి.

ఏలూరు కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా, మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు కేంద్రంగా గుంటూరు జిల్లా, బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లా, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా, ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా, నెల్లూరు కేంద్రంగా శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కర్నూలు కేంద్రంగా కర్నూలు జిల్లా, నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లా, అనంతపురం కేంద్రంగా అనంతపురం జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా, కడప కేంద్రంగా వైఎస్సార్‌ కడప జిల్లా, రాయచోటి కేంద్రంగా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా, తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లా ఏర్పాటు కానున్నాయి.

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా అడుగులు

శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట. రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16) మొత్తం 30 మండలాలు. జిల్లా వైశాల్యం 4,591 చ.కి.మీ, జనాభా 21.91 లక్షలు ఉంది. విజయనగరం జిల్లాలో 7 నియోజకవర్గాలు రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట. రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి(11), విజయనగరం(15) మొత్తం మండలాలు 26 ఉండనున్నాయి. జిల్లా వైశాల్యం 3,846 చ.కి.మీ ఉండగా, జనాభా 18.84 లక్షలు ఉంది.

మన్యం జిల్లాలో పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు కలిపి మొత్తం 4 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు పాలకొండ(6),పార్వతీపురం(10) కలిపి మొత్తం 16 మండలాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 3,935 చ.కి.మీ, జనాభా 9.72లక్షలు ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3 నియోజకవర్గాలు పాడేరు, అరకు, రంపచోడవరం. రెవెన్యూ డివిజన్లు కొత్తగా పాడేరు(11), రంపచోడవరం(11) కలిపి మొత్తం 22 మండలాలు. జిల్లా వైశాల్యం 12,251 చ.కి.మీ, జనాభా 9.54 లక్షలు ఉంది.
విశాఖపట్నం జిల్లాలో భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక కలిపి మొత్తం 6 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(5) కలిపి మొత్తం 10 మండలాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 928 చ.కి.మీ, జనాభా 18.13 లక్షలుగా ఉంది.

New Districts : ఏపీలో కొత్త జిల్లాలు ఇవే..!

అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి కలిపి 7 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు నర్సీపట్నం(10), అనకాపల్లి(15) కలిపి మొత్తం 25 మండలాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 4,412 చ.కి.మీ, జనాభా 18.73 లక్షలు ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం కలిపి 7 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు పెద్దాపురం(12),కాకినాడ(7) కలిపి మొత్తం 19 మండలాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 2,605 చ.కి.మీ కాగా, జనాభా 19.37 లక్షలు ఉంది.

కొత్తగా ఏర్పాటు కానున్న కోనసీమ జిల్లాలో రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం కలిపి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. రెవెన్యూ డివిజన్లు రామచంద్రాపురం(8), అమలాపురం(16) కలిపి మొత్తం 24 మండలాలు ఉండనున్నాయి. జిల్లా వైశాల్యం 2,615 చ.కి.మీ, జనాభా 18.73 లక్షలు ఉంది. కొత్తగా ఏర్పడే రాజమహేంద్రవరం జిల్లా అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం కలుపుకుని మొత్తం 7 నియోజకవర్గాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(10) మొత్తం కలిపి 20 మండలాలు ఉండనున్నాయి. జిల్లా వైశాల్యం 2,709 చ.కి.మీ ఉండగా జనాభా: 19.03 లక్షలు ఉంది.

Buddhadeb Bhattacharya: పద్మభూషణ్‌ నాకొద్దు.. తిరస్కరించిన బుద్ధదేవ్ భట్టాచార్య!

కొత్తగా ఏర్పడే నరసాపురం జిల్లాలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం కలిపి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. రెవెన్యూ డివిజన్లు నరసాపురం(8), కొత్తగా భీమవరం(11) మొత్తం కలిపి 19 మండలాలు ఉండనున్నాయి. జిల్లా వైశాల్యం 2,178 చ.కి.మీ, జనాభా 17.80 లక్షలు ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు కలిపి మొత్తం 7 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు ఏలూరు(12), జంగారెడ్డిగూడెం(9), నూజివీడు(6) కలుపుకుని మొత్తం 27 మండలాలు ఉన్నాయి. జిల్లా వైశాల్యం 6,413 చ.కి.మీ, జనాభా: 20.03 లక్షలుగా ఉంది.

కృష్ణా జిల్లాలో గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ మొత్తం 7 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12) మొత్తం 25 మండలాలు. జిల్లా వైశాల్యం: 3,775 చ.కి.మీ, జనాభా: 17.35 లక్షలు.
కొత్తగా ఏర్పడే ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు కలిపి మొత్తం 7 నియోజకవర్గాలు. అలాగే రెవెన్యూ డివిజన్లు విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7) మొత్తం కలిపి 20 మండలాలు ఉండనున్నాయి. జిల్లా వైశాల్యం 3,316 చ.కి.మీ, జనాభా: 22.19 లక్షలు. గుంటూరు జిల్లాలో తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి కలుపుకొని మొత్తం 7 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8) కలిపి మొత్తం 18 మండలాలు. జిల్లా వైశాల్యం: 2,443 చ.కి.మీ, జనాభా: 20.91 లక్షలు.

Ghulam Nabi Azad: ఆజాద్‌కు పద్మభూషణ్ అవార్డు.. ‘బానిస’ అంటూ కాంగ్రెస్ విమర్శలు

కొత్తగా ఏర్పాటు కానున్న బాపట్ల జిల్లాలో వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల కలిపి మొత్తం 6 నియోజకవర్గాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు : కొత్తగా బాపట్ల(12), కొత్తగా చీరాల (13) మొత్తం 25 మండలాలు ఉండనున్నాయి. జిల్లా వైశాల్యం : 3,829 చ.కి.మీ, జనాభా : 15.87 లక్షలు ఉంది. పల్నాడు జిల్లాలో పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి మొత్తం కలిపి 7 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు గురజాల (14), నరసరావుపేట(14) కలుపుకొని మొత్తం 28 మండలాలు. జిల్లా వైశాల్యం : 7,298 చ.కి.మీ, జనాభా : 20.42 లక్షలు.

ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి కలుపుకొని మొత్తం 8 నియోజకవర్గాలు ఉండనున్నాయి. రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13) మొత్తం 38 మండలాలు. జిల్లా వైశాల్యం : 14,322 చ.కి.మీ, జనాభా : 22.88 లక్షలు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు కలిపి 8 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు (12), ఆత్మకూరు (11), కావలి(12) మొత్తం 35 మండలాలు. జిల్లా వైశాల్యం : 9,141 చ.కి.మీ, జనాభా : 23.37 లక్షలు.

Anee Master : అనీ మాస్టర్‌కు కరోనా.. రెండో సారి.. కరెక్ట్‌గా వన్ ఇయర్ గ్యాప్‌తో

కర్నూలు జిల్లాలో పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు కలిపి 8 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17) మొత్తం 28 మండలాలు. జిల్లా వైశాల్యం : 8,507 చ.కి.మీ, జనాభా : 23.66 లక్షలు. నంద్యాల జిల్లాలో నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు కలిపి మొత్తం 6 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్‌ (8), కొత్తగా ఆత్మకూరు(10) మొత్తం 27 మండలాలు. వైశాల్యం : 9,155 చ.కి.మీ, జనాభా : 16.87 లక్షలు.

అనంతపురం జిల్లాలో రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్‌ కలిపి మొత్తం 8 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం (12), అనంతపురం (14), కొత్తగా గుంతకల్‌(8) మొత్తం 34 మండలాలు. వైశాల్యం : 11,359 చ.కి.మీజనాభా : 23.59 లక్షలు. కొత్తగా ఏర్పడే శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి కలిపి 6 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు : పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8) మొత్తం 29 మండలాలు ఉంటాయి. వైశాల్యం : 7,771 చ.కి.మీ, జనాభా : 17.22 లక్షలు.

India Corona : దేశంలో కొత్తగా 2,85,914 కరోనా కేసులు, 665 మంది మృతి

వైఎస్సార్‌ కడప జిల్లాలో కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు కలుపుకొని 7 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు : కడప(10), జమ్మలమడుగు(12), కొత్తగా బద్వేలు (12) మొత్తం 34 మండలాలు ఉన్నాయి. వైశాల్యం : 10,723 చ.కి.మీ, జనాభా : 19.90 లక్షలు. అన్నమయ్య జిల్లాలో రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి కలిపి మొత్తం 6 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11) మొత్తం 32 మండలాలు. వైశాల్యం : 8,459 చ.కి.మీ, జనాభా : 17.68 లక్షలు.

చిత్తూరు జిల్లాలో నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు కలుపుకుని 7 నియోజకవర్గాలు ఉంటాయి. రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు, (15) మొత్తం కలిపి 33 మండలాలు ఉంటాయి. వైశాల్యం : 7,210 చ.కి.మీ, జనాభా : 19.85 లక్షలు, కొత్తగా ఏర్పాటయ్యే శ్రీ బాలాజీ జిల్లాలో సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి కలుపుని 7 నియోజకవర్గాలు. రెవెన్యూ డివిజన్లు : నాయుడుపేట(13), గూడూరు (11), తిరుపతి (11) మొత్తం 35 మండలాలు. జిల్లా వైశాల్యం : 9,176 చ.కి.మీ, జనాభా : 22.18 లక్షలు ఉంది.