AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా అడుగులు

ఏపీలో కొత్త జిల్లాలుగా మన్యం, అల్లూరి సీతారామారాజు, ఎన్టీఆర్, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, కాకినాడ, అన్నమయ్య, శ్రీబాలాజీ ఏర్పాటు కానున్నాయి.

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా అడుగులు

New District (1) 11zon

formation of new districts in AP : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేయనున్న 13 జిల్లాలతో కలిపి 26 జిల్లాలు కానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాలు, అభిప్రాయాలు సేకరించాలని కలెక్టర్లకు సీఎస్‌ సూచించారు. 1974 ఏపీ జిల్లాల చట్టం ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. చట్టానికి అనుగుణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై CCLA ప్రాథమిక నోటిఫికేషన్‌ రూపొందించింది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. సూచనలు, సలహాల కోసం 30 రోజుల గడువు ఇస్తారు. వాటిని పరిశీలించి అవసరమైతే మార్పులు, చేర్పులు చేస్తారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. అందులోనే కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుపుతూ అపాయింటెడ్‌ తేదీని పేర్కొంటారు. ఆ తేదీ నుంచి కొత్త జిల్లాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియనంతటినీ ఉగాదిలోపు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

AP New Districts : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

ఆంధప్రదేశ్‌లో 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఈ లెక్కన చూస్తే 25 జిల్లాలు కావాలి. ఇక అరకు లోక్‌సభ నియోజకవర్గం భౌగోళికంగా విస్తరించి ఉండడంతో రెండు జిల్లాలు చేయాలని ప్రతిపాదించింది. దీంతో 26 కానున్నాయి. అయితే విస్తీర్ణంలో ప్రకాశం అతిపెద్ద జిల్లాగా అవతరించనుంది. ఇక విశాఖపట్నం అతి చిన్న జిల్లాగా మారనుంది. జనాభా పరంగా కర్నూలు అతిపెద్ద జిల్లాగా ఉండనుంది…చిన్న జిల్లాగా అరకు ఏర్పడనుంది.

ఏపీలో కొత్త జిల్లాల పునర్వస్థీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. మన్యం, అల్లూరి సీతారామారాజు, ఎన్టీఆర్, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, కాకినాడ, అన్నమయ్య, శ్రీబాలాజీ జిల్లాల ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక నోటిఫికేషన్లపై స్థానికుల నుంచి అభ్యంతరాలు, సూచనలున స్వీకరించనున్నారు. 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Republic Day : 73వ గణతంత్ర వేడుకలకు భారతావని సిద్ధం

పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా, పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా, కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా, అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా, ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లా, నరసరావు పేట కేంద్రంగా పల్నాడు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు కనిపిస్తోంది.

నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు జిల్లా కేంద్రాలు మార్పు కానున్నాయి. రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లా, భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా కొనసాగనున్నాయి.