Worldwide Corona : ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం.. ఒక్కరోజులో 33,20,485 పాజిటివ్ కేసులు

ప్రపంచవ్యాప్తంగా 36 కోట్లకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. ఇప్పటిరవకు 56,33,406 మంది కరోనాతో మృతి చెందారు.

Worldwide Corona : ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం.. ఒక్కరోజులో 33,20,485 పాజిటివ్ కేసులు

Corona Virus (1)

Worldwide new corona positive cases : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకూ భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొత్తగా 33,20,485 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 9,650 మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా 36 కోట్లకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 35,90,43,286 కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిరవకు 56,33,406 మంది కరోనాతో మృతి చెందారు.

అమెరికాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. అమెరికాలో కొత్తగా 4,43,072 కేసులు నమోదు అయ్యాయి. 2,611 మంది వైరస్ తో మృతి చెందారు. ఫ్రాన్స్​లో కొత్తగా 5,01,635 కేసులు నమోదు కాగా, 467 మంది మృతి చెందారు. భారత్ లో కొత్తగా 2,85,914 కేసులు, 665 మరణాలు నమోదు అయ్యాయి. ఇటలీలో కొత్తగా 186,740 కేసులు నమోదవ్వగా, 338 మంది మృతి చెందారు.

India Corona : దేశంలో కొత్తగా 2,85,914 కరోనా కేసులు, 665 మంది మృతి

బ్రెజిల్​లో కొత్తగా 1,99,126 కేసులు, 489 మరణాలు నమోదు అయ్యాయి. అర్జెంటీనాలో కొత్తగా 1,00,863 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 259 మంది మృతి చెందారు. జర్మనీలో కొత్తగా 1,48,408 కేసులు నమోదు కాగా, 184 మరణాలు సంభవించాయి. బ్రిటన్​లో కొత్తగా 94,326 కేసులు నమోదు కాగా,​ కరోనాతో 439 మంది మృతి చెందారు. స్పెయిన్ లో ​కొత్తగా 1,14,877 కేసులు, 382 మరణాలు నమోదు అయ్యాయి.

భారత్ లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు నాలుగు కోట్లపైగా దాటాయి. దేశంలో కొత్తగా 2,85,914 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ తో 665 మంది చనిపోయారు. నిన్న నమోదైన కేసులతో పోల్చితే 30,040 మేర పాజిటివ్ కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 22,23,018 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు 5.55 శాతంగా ఉన్నాయి.

Republic Day : రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవాలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

దేశంలో రోజువారీ పాజిటివిటి రేటు 16.16 శాతానికి చేరుకుంది. ఇప్పటివరకు 4,00,85,116 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 4,91,127 మంది మరణించారు. దేశంలో కరోన రికవరీ రేటు 93.23 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 2,99,073 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 3,73,70,971 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.