తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. తెలంగాణలో లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పెట్టుకున్న టార్గెట్ 14ను సాధించేలా ప్రణాళిక వేసుకున్నారు. తమ సర్కారు పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమ్ అని ఇప్పటికే రేవంత్ రెడ్డి అన్నారు.
నేటి నుంచి ఆయన ప్రచారాన్ని ఉద్ధృతం చేయనున్నారు. నేటి నుంచి మే 11 వరకు 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. మొత్తం 50 సభలు, ర్యాలీలు నిర్వహించేలా ప్రణాళికలు వేసుకున్నారు. ఇవాళ సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభలోనూ రేవంత్ పాల్గొంటారు.
రేవంత్ పాల్గొనే ర్యాలీలు