టిక్కెట్స్ వుండవ్.. డబ్బులివ్వక్కర్లా..కార్డు స్వైప్ చేస్తే టికెట్ జనరేట్ …ఆర్టీసీ బస్సులో సీసీ కెమెరాలు..96 శాతం బసెలలో ఇప్పటికే ట్రాకింగ్ సిస్టం అమలు..ఏసీఎస్ ఆర్టీసీలో డిజిటల్ సిస్టం..ఏపీఎస్ ఆర్టీసీలో సరికొత్త విధానం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు అడుగులు వేస్తోంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు టెక్నాలజీని వినియోగించేందుకు యత్నిస్తోంది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. టికెట్ విధానం కాకుండా స్వైపింగ్ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ఎండీ సురేంద్రబాబు తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణించేటప్పుడు టికెట్ కోసం డబ్బులు చెల్లించుకుండా కార్డు స్వైప్ చేస్తే టికెట్ జనరేట్ అయిపోతుందని సురేంద్రబాబు తెలిపారు. టికెట్కు చెల్లించాల్సిన మొత్తం కార్డు నుంచి కట్ అవుతుందని..ఆర్టీసీ బస్సుల్లో 96 శాతం వాహనాలకు ఇప్పటికే ట్రాకింగ్ సిస్టం అమలవుతోందని..త్వరలో అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు అమర్చనున్నామని ఆర్టీసీ సంస్థ ఎండీ సురేంద్రబాబు తెలిపారు.