Corona Update : తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. రోజువారీ కొత్త కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. వరుసగా రెండోరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా గడిచిన 24 గంటల్లో 42, 531 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1520 మందికి పాజిటివ్గా తేలింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,85, 543కి చేరింది. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఒకరు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4, 034కు చేరింది. గడిచిన 24 గంటల్లో 209 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,168 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
చదవండి : World Corona Report : ఒక్కరోజే 17.62 లక్షల కరోనా కేసులు
ఇక గడిచిన 24గంటల్లో కొత్తగా ఒమిక్రాన్ కేసులు నమోదు కాకపోవడం శుభపరిణామమే అని చెప్పాలి. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా ఎలాంటి ఒమిక్రాన్ కేసులు నమోదుకాలేదని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 13,652 మంది ప్రయాణికులకు రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొవిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఒమిక్రాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి 13,652 మంది శంషాబాద్ విమానాశ్రయానికి రాగా వారికి పరీక్షలు చేసిన అధికారులు 207 మందికి కరోనా సోకిందని తేల్చారు. ఇక ఒమిక్రాన్ నిర్ధారిత పరీక్షల కోసం వీటిని జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్కి పంపగా.. వారిలో 162 మందికి ఒమిక్రాన్ సోకిందని తేలింది.
చదవండి : AP Corona : ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు