Crows Attack
Crows Attack in Sircilla : మగవాళ్లపై కాకులు పగబట్టాయి. కేవలం మగవాళ్ల తలపై కాళ్లతో తన్నుతూ కాకులు దాడి చేస్తున్నాయి. విచిత్రంగా ఉన్నా నమ్మితీరాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియోసైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. సిరిసిల్ల పాత బస్టాండ్ లో కట్టమైసమ్మ గుడివద్ద తిరుగుతున్న మగవాళ్లపై కాకులు కాళ్లతో దాడి చేస్తున్నాయి. బస్టాండ్ నుంచి బయటకు వెళ్లే వారిపై, లోపలికి వచ్చే మగవాళ్లను మాత్రమే తలపై తన్నుతూ చెట్టు కొమ్మపైకి వెళ్లి వాలుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. అక్కడి కాకులు మగవాళ్లపైనే ఎందుకు దాడిచేస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు.
Also Read : Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్ ఇంటివద్ద కొనసాగుతున్న హైడ్రామా.. అక్కడే నిద్రించిన భార్యాబిడ్డలు
మగవాళ్లను కాలితో తన్నుతూ దాడి చేస్తున్న కాకులు
సిరిసిల్ల – పాత బస్టాండ్లో కట్ట మైసమ్మ గుడి వద్ద అక్కడ తిరుగుతున్న మగవాళ్ల పై దాడి చేస్తున్న కాకులు
బస్టాండ్ నుండి బయటకి వెళ్ళే, లోపలికి వచ్చే మగ వాళ్లను మాత్రమే తలపై తంతు చెట్టు కొమ్మ పై వాలుతున్న కాకులు pic.twitter.com/HRLUUQVdYS
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2024