Harish Rao : ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఇచ్చిన అన్నీ హామీలు అమలు చేయాలి : హరీశ్ రావు

Harish Rao Comments : 25 వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల హామీగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. 11 వేల పోస్టులు మాత్రమే వేసి చేతులు దులుపుకుందని విమర్శించారు.

Harish Rao : డీఎస్సీ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు, ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.

Read Also : ధరణి సమస్యలకు త్వరలోనే పరిష్కారం.. నవీన్ మిట్టల్ కీలక ఆదేశాలు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన పోస్టులకు నియామక పత్రాలు అందించి, 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకోవడం తప్ప, యువత, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటి? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రూప్స్ విద్యార్థుల వినతులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టిన నాయకులు, అధికారంలోకి రాగానే వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యంమన్నారు. గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100, గ్రూప్ 2, గ్రూపు 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు.. నాయకుల కాళ్ళు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 ఎల్జిబిలిటీ పరిగణించాలని విజ్ఞప్తి చేసిన వారికి అధికారంలోకి రాగానే ఆ విజ్ఞప్తులు ఎందుకు కనిపించడం లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రశ్నించారు.

25 వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల హామీగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. 11 వేల పోస్టులు మాత్రమే వేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, 6 నెలలు గడుస్తున్నా ఆ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించకపోవడం విద్యార్థులను మోసం చేయడమేనని హరీశ్ రావు విమర్శించారు.

Read Also : RK Roja : ఎందుకు సిగ్గుపడాలి? మంచి చేసి ఓడిపోయాం.. : ఆర్కే రోజా సంచలన ట్వీట్!

ట్రెండింగ్ వార్తలు