ధరణి సమస్యలకు త్వరలోనే పరిష్కారం.. నవీన్ మిట్టల్ కీలక ఆదేశాలు
పెండింగ్ దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని చెప్పారు.
![ధరణి సమస్యలకు త్వరలోనే పరిష్కారం.. నవీన్ మిట్టల్ కీలక ఆదేశాలు ధరణి సమస్యలకు త్వరలోనే పరిష్కారం.. నవీన్ మిట్టల్ కీలక ఆదేశాలు](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2024/06/Naveen-Mittal.jpg)
Naveen Mittal
ధరణి సమస్యలపై కలెక్టర్లతో తెలంగాణ భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2.20 లక్షల పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు.
ఈ నెలలోనే వీలైనన్ని దరఖాస్తులు పరిష్కరించాలని అన్నారు. పాస్ బుక్ డేటాలోనే అధికంగా దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. ధరణిలో 188 టెక్నికల్ సమస్యలను గుర్తించామని అన్నారు. వాటిలో 163 సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు.
Also Read: పార్టీ అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా సరే..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
వారం-పది రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహిస్తామని అన్నారు. పెండింగ్ దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని చెప్పారు. అతి తక్కువ ములుగులో ఉన్నాయని అన్నారు. కాగా, ధరణి సమస్యల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.