పండగ సీజన్ వచ్చినా, సాధారణ రోజుల్లో అయినా కాకినాడ – హైదరాబాద్ మధ్య రైలు టికెట్ దొరకడం చాలా కష్టం. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) ఒక కీలక ప్రకటన చేసింది. కాకినాడ నుంచి హైదరాబాద్లోని లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లకు కొత్తగా వారానికి మూడు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..
కాకినాడ టౌన్ – చెర్లపల్లి (రైలు నం. 07447/07448)
కాకినాడ టౌన్ – లింగంపల్లి (రైలు నం. 07445/07446)
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని రకాల కోచ్లను ఏర్పాటు చేశారు.
ఈ కొత్త సర్వీసులు ప్రస్తుతం ఉన్న రైళ్లపై భారాన్ని తగ్గించి, ప్రయాణికులకు మరిన్ని బెర్తులను అందుబాటులోకి తెస్తాయని రైల్వే అధికారులు అంటున్నారు. ఈ కొత్త రైళ్ల ప్రకటన కాకినాడ-హైదరాబాద్ మార్గంలో తరచూ ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. టికెట్లను IRCTC వెబ్సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.