ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

ఎఫ్ టీఎల్ లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించారని రంగనాథ్ చెప్పారు.

N Convention Demolition : చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఎన్ కన్వెన్షప్ పై ఎలాంటి స్టే లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవస్థను తప్పుదారి పట్టించి వ్యాపార కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో అనుమతి లేని నిర్మాణాలు చేపట్టారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటున్నారు. ఎఫ్ టీఎల్ లో ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు ఆక్రమించారని రంగనాథ్ చెప్పారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి లేదని హైడ్రా కమిషనర్ తేల్చారు.

 

Also Read : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల్లో ట్విస్ట్.. మంత్రి ఫిర్యాదుతోనే రంగంలోకి హైడ్రా బృందం!

ట్రెండింగ్ వార్తలు