మరోసారి అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసిన హైడ్రా.. ఎన్ని ఎకరాల భూమి స్వాధీనం చేసుకుందంటే..

ఎన్ని చోట్ల అక్రమ కట్టడాలు నేలమట్టం చేశారు, ఎన్ని ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.. ఈ వివరాలన్నీ తెలియజేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.

Hydra Demolitions : హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. తగ్గేదేలే అన్నట్లుగా హైడ్రా దూసుకుపోతోంది. అక్రమ కట్టడాలపై మరోసారి కొరడా ఝళిపించింది. ఆదివారం పలు చోట్ల ఆక్రమణలను నేలమట్టం చేసింది హైడ్రా. ఎన్ని చోట్ల అక్రమ కట్టడాలు నేలమట్టం చేశారు, ఎన్ని ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.. ఈ వివరాలన్నీ తెలియజేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఆదివారం మూడు ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 8 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

కూకట్ పల్లి నల్లచెరువు దగ్గర 16 సెంట్లు, ఇతర నిర్మాణాలను కూల్చేశారు. నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు. కాగా, హైడ్రా 4 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేటలోనూ మూడు నిర్మాణాలను నేలమట్టం చేశారు. తద్వారా అక్కడ ఎకరం ల్యాండ్ ని స్వాధీనం చేసుకున్నారు. పటేల్ గూడలోనూ 25 అక్రమ నిర్మాణాలు కూల్చేసి 3 ఎకరాల ల్యాండ్ ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనాలు పూర్తయ్యాక.. ఆదివారం మరోసారి ఆక్రమణల కూల్చివేతలను ప్రారంభించింది హైడ్రా. నగరంలోని మూడు ప్లేసుల్లో ఏకకాలంలో కూల్చివేతలు చేయడం జరిగింది. ప్రధానంగా నల్లచెరువు ప్రాంతంలో దాదాపు 16 షెడ్లను కూల్చేశారు. నల్లచెరువుకు సంబంధించి మొత్తం 27 ఎకరాలు బఫర్ జోన్ లో ఉండగా అందులో దాదాపుగా 8 ఎకరాల వరకు కబ్జా అయినట్లు గుర్తించిన అధికారులు.. ఇప్పుడు 16 నిర్మాణాలను కుప్పకూల్చారు. తద్వారా 4 ఎకరాల ల్యాండ్ ను స్వాధీనం చేసుకున్నట్లైంది.

మిగిలిన ప్రాంతాల్లో ఇప్పటికే పబ్లిక్ ఉన్నారు. చిన్న, చిన్న ఇళ్లు.. భవనాలు ఉన్నాయి. వీటిలో పబ్లిక్ నివాసంలో ఉన్నారు. మిగతా మూడు ఎకరాలకు సంబంధించి స్వాధీనం చేసుకునే పరిస్థితి లేదు. వాటి జోలికి హైడ్రా అధికారులు వెళ్లలేదు. మిగతా ప్రాంతాల విషయానికి వెళ్తే.. అమీన్ పూర్ మండలం రెండు చోట్ల.. కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చేయడం జరిగింది. పటేల్ గూడ విషయానికి వస్తే.. దాదాపు 25 అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. పటేల్ గూడలో తద్వారా 3 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్లైంది. ఇక్కడ విల్లాలను నిర్మించారు. వాటన్నింటిని నేలమట్టం చేశారు.

అమీన్ పూర్ కు సంబంధించి మరో ప్రాంతమైన కిష్టారెడ్డిపేటలోనూ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దాదాపు ఒక ఎకరం భూమిలో నిర్మాణాలు చేసినట్లు గుర్తించారు. వాటిని కూల్చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వినాయక నిమజ్జనం ముందువరకు మొత్తం 262 అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చింది. దీని ద్వారా 111 ఎకరాల భూమిని స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇప్పుడు మరో 8 ఎకరాలు.. అంటే దాదాపుగా 119 ఎకరాల వరకు భూములను స్వాధీనం చేసుకున్న పరిస్థితి.

Also Read : రియల్ ఎస్టేట్ ఆదాయంపై హైడ్రా ఎఫెక్ట్..! అయినా తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి..

దాదాపు 300 వరకు అక్రమ కట్టడాలను నేలమట్టం చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే.. మరోసారి హైడ్రా తన పనిని స్టార్ట్ చేసినట్లుగా చెప్పొచ్చు. ఇక, ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో హైడ్రాకు ప్రత్యేక అధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. హైడ్రాకు మరింత పవర్ ఫుల్ గా మార్చారు. దీంతో రేపటి నుంచి హైడ్రా మరింత దూకుడుగా వెళ్లే పరిస్థితులు ఉన్నాయి.