Indiramma House Scheme
చెంచులకు రాష్ట్రంలో 21 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వారి సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా 13,266 కుటుంబాలకు ఇళ్లు ఇస్తున్నామని వివరించారు. చెంచులు బాగా వెనకబడిపోయారని, ఎన్నో ఏళ్లుగా సొంత ఇళ్లు లేకుండానే జీవిస్తున్నారని చెప్పారు.
ఉట్నూరు, భద్రాచలంతో పాటు మున్ననూర్, ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలోని చెంచులకు ఇళ్లు మంజూరు చేసినట్లు వివరించారు. తొలి దశలో ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా మున్ననూర్లో ఇళ్ల మంజూరు పత్రాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 10,836 ఇళ్లు ఇస్తున్నామన్నారు.
మున్ననూర్ చెంచు స్పెషల్ ప్రాజెక్టులో భాగంగా 2,156 ఇళ్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 2025లో తెలంగాణలోని ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500-700 ఇళ్లు చొప్పున మంజూరు చేశామన్నారు.
ఏ ప్రాంతాల్లో ఎన్నెన్ని ఇళ్లు?