JNTU New Policy : బీటెక్‌లో బ్రేక్‌ స్టడీ..ఏడాది ఆపేసి మళ్లీ చదువుకొనే అవకాశం

జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. జేఎన్ టీయూ మరో కొత్త విధానం తీసుకొచ్చింది. బ్రేక్‌ స్టడీ విధానాన్ని తీసుకొచ్చింది.

Jntu

Break study in BTech : జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ (జేఎన్ టీయూ) బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. జేఎన్ టీయూ మరో కొత్త విధానం తీసుకొచ్చింది. స్టార్టప్ ప్రోత్సాహానికి నూతన నిర్ణయం తీసుకుంది. ఏడాదిపాటు చదువును మధ్యలో ఆపి మళ్లీ కొనసాగించే బ్రేక్‌ స్టడీ విధానాన్ని తీసుకొచ్చింది.

స్టార్టప్స్‌లో రాణించే విద్యార్థులను ప్రోత్సహించడంతోపాటు తీవ్ర ఆరోగ్య సమస్యలున్నవారికి ఈ అవకాశం కల్పించింది. ఈ మేరకు జేఎన్ టీయూ మార్గదర్శకాలు వెల్లడించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేస్తున్నట్లు జేఎన్ టీయూ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి పేర్కొన్నారు.

AICTE : విద్యార్థులకు గుడ్ న్యూస్.. బీటెక్‌లో చదవకపోయినా ఎంటెక్‌లో చేరొచ్చు

ఇంతకముందు బీటెక్‌లో చేరితే నాలుగేళ్లపాటు వరుసగా చదువాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఒక విద్యార్థి గరిష్ఠంగా రెండు సెమిస్టర్లపాటు తాత్కాలిక విరామం తీసుకోవచ్చు. బీటెక్‌ విద్యార్థులు కొందరు ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు స్టార్టప్స్‌లో రాణిస్తున్నారు. సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అన్వేషిస్తున్నారు.

ఈ దశలో ఇటు చదువా.. అటు స్టార్ట ప్పా.. అన్నది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మధ్యలో చదువులు ఆపేస్తే పట్టా చేతికి అందదని, చదువులకు ప్రాధాన్యతిస్తే మొగ్గదశలోనే నవ ఆలోచనలను తుంచేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన జేఎన్ టీయూ బ్రేక్‌ స్టడీ విధానాన్ని తీసుకొచ్చింది.

Telangana : వరిసాగు తగ్గించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం.. ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్

అయితే స్టార్టప్స్‌ వెంచర్లు, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు మాత్రమే బ్రేక్‌ స్టడీకి అర్హులని ప్రకటించింది. తొలి నాలుగు సెమిస్టర్లు పూర్తిచేసినవారికే ఈ అవకాశం కల్పించారు. బ్యాక్‌ల్యాగ్స్‌ ఉన్నవారికి, హాజరుశాతంలేని విద్యార్థులకు ఈ అవకాశం ఉండదు. ఆయా విద్యార్థులు జేఎన్ టీయూ వీసీకి రిపోర్ట్‌ చేసి, అనుమతి పొందాలి.

ఏ కారణంతో బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్నారో వెల్లడించాలి. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ నుంచి సైతం అనుమతి పొందాల్సి ఉంటుంది. సంవత్సరం పూర్తికాగానే మళ్లీ కోర్సులో తప్పనిసరిగా చేరాల్సివుంటుంది.