Karimnagar Twins Delivered : కవలపిల్లల్ని చూస్తే ఎంతో ముచ్చటగా ఉంటుంది. భలే ఉన్నారు అచ్చుగుద్దినట్లుగా. ఎవరు ఎవరో కూడా పోల్చుకోలేం అని అనుకుంటా. అదే కవలలు పెళ్లి అయిన వారికి కూడా కవల పిల్లలు పుడితే అది విశేషం కాక మరేమిటి? అదే జరిగింది తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో. ఇద్దరు అక్కచెల్లెళ్లు కవలపిల్లలు. వారి వివాహాలు అయ్యాయి. ఇద్దరు గర్భం ధరించారు.
వారు కూడా కవల పిల్లల్ని కన్నారు. పైగా అక్కకు నలుగురు పిల్లలు పుట్టగా చెల్లెలికి ముగ్గురు పిల్లలు పుట్టిన వింత ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టడం చాల ఆరుదు. తాజాగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగుల మల్యాలకు చెందిన నికిత,లిఖిత అనే కవలపిల్లలకు కూడా కవలపిల్లలే పుట్టారు. అక్క ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు.
నికిత కు పురిటి నొప్పులు రాగా స్థానిక యశోద కృష్ణ ప్రైవేటు హాస్పిటల్స్ కు తరలించారు. డాక్టర్లు ఆమెను పరీక్షించి ఆమె గర్భంలో నలుగు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. ఆ తరువాత నికితకు సుమారు 12 గంటల పాటు ఆపరేషన్ చేసి నలుగురు పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు డాక్టర్లు.
అలాగే నికితతో పాటు ఆమె చెల్లెలు లిఖిత కూడా ముగ్గురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చింది. దీంతో ఈ కేసును వైద్యులు చాల జాగ్రత్తల మధ్య ఆపరేషన్ చేశామని డాక్టర్ యశోద తెలిపారు. ఇటువంటి సంఘటనలు ఏడు లేదా ఎనిమిది లక్షల మందిలో ఇటువంటి ప్రసవాలు ఉంటాయని ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ల టీమ్ తెలిపింది.