Kcr Grand Son
Kcr Grand Son: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షును ప్రతిష్టాత్మక డయానా అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని హిమాన్షు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. SHOMA అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు తనకు ఈ అవార్డు వచ్చినట్లు హిమాన్షు ట్విటర్లో చెప్పారు. గ్రామాలను స్వయం సమృద్ధి సాధించే దిశగా తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ఈ అవార్డు తనకు దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు ట్వీట్లో హిమాన్షు అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తనకు మార్గదర్శకుడిగా నిలిచిన తన తాత, సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు హిమాన్షు. ఈ సంథర్భంగా గంగాపూర్-యూసుఫ్ఖాన్పల్లి వాసులకు, తన గురువులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.
తొమ్మిది సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి ఇచ్చే ఈ అవార్డు.. సమాజంలో మార్పు కోసం మానవీయ దృక్పథంతో చేసే పనులకి ఇస్తారు. 25 ఏళ్ల కిందట మరణించిన వేల్స్ యువరాణి డయానా పేరు మీదుగా ఈ అవార్డు ఏర్పాటు చేశారు. ఆహార ఉత్పత్తుల్లో కల్తీ అంశంపై గ్రామీణుల్లో అవగాహన కల్పించడంతోపాటు కల్తీ లేని ఉత్పత్తులను చేయడంలో వాళ్లు సాధికారత సాధించే దిశగా ప్రోత్సహించడమే SHOMA కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
మంత్రి శ్రీ కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకి డయానా అవార్డు దక్కింది. తొమ్మిది సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి ఇచ్చే ఈ అవార్డు ఈ సారి హిమన్షు రావు కి దక్కింది. సమాజంలో మార్పు కోసం మానవీయ దృక్పథంతో చేసే పనులకి ఈ అవార్డు ఇస్తారు. pic.twitter.com/Rv6f8GtYUB
— Thirupathi Bandari (@BTR_KTR) June 28, 2021
With great delight I announce that I have received my Diana Award for my tremendous Initiative SHOMA-Making Villages Self-Sustainable! More details will be announced soon! pic.twitter.com/l6FgUSKQfp
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) June 28, 2021