Amit Shah : తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ అమిత్ షా ఎన్నికల ప్రచారం.. పూర్తి షెడ్యూల్ ఇలా ..

బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో ఏపీలోని ధర్మవరానికి అమిత్ షా చేరుకుంటారు. అక్కడ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ తో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.

Amit Shah Tour In Telugu States : తెలుగు రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన కమలం హైకమాండ్ వరుస టూర్లు చేస్తుంది. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం కమలం అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇవాళ (ఆదివారం) మరోసారి కేంద్ర మంత్రి అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపీలోని ధర్మవరం, తెలంగాణలో అదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

Also Read : Posani Krishna Murali : అది నిరూపిస్తే.. చంద్రబాబు కాళ్లు కడిగి వెంటనే టీడీపీలో చేరతా- పోసాని కృష్ణమురళి

బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో ఏపీలోని ధర్మవరానికి అమిత్ షా చేరుకుంటారు. అక్కడ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ తో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం రాప్తాడు, అనంతపురం నియోజకవర్గాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో కలిసి ప్రచార సభలో అమిత్ షా పాల్గొనున్నారు. అనంతరం అక్కడి నుంచి తెలంగాణకు అమిత్ షా బయలుదేరుతారు. మధ్యాహ్నం 3గంటలకు అదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాగజ్ నగర్ చేరుకుంటారు. అక్కడ ఎస్పీఎం మైదానంలో జరిగే బీజేపీ వికాస సంకల్ప బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 4గంటలకు నిజామాబాద్ లో బీజేపీ సభలో అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 6గంటలకు మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఉప్పల్ ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు అమిత్ షా హాజరవుతారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు.

Also Read : Cm Revanth Reddy : ముఖ్యమంత్రి పదవి నుంచి నన్ను దించేయాలని చూస్తున్నారు- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు