minister ktr : టీఆర్ఎస్ కార్యకర్త కూతురి బర్త్డేకు ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సర్ప్రైజ్ చేశారు. ఆ పాపకు అదిరిపోయే గిప్ట్ పంపారు. చిన్నారికి టెడ్డీబేర్తోపాటు ట్యాబ్ను పంపి.. బర్త్ డేనాడు బాలికను దిల్ఖుష్ చేశాడు. దీంతో ఆ బాలిక కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపింది. కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త… హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 20 రోజుల క్రితం కరీంనగర్ నుంచి హైదరాబాద్లోనే ఉంటూ వాణీదేవి తరపున ప్రచారం చేస్తున్నారు. ఖాజా నవాజ్ హుస్సేన్ భార్య తొమ్మిది నెలల గర్భవతి కూడా. ఫోన్లోనే భార్య యోగక్షేమాలు తెలుసుకుంటూ పార్టీ అప్పజెప్పిన బాధ్యతను నెరవేర్చుతున్నాడు. అయితే శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో మంత్రి కేటీఆర్ కార్యకర్తలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంలోనే హుస్సేన్ భార్య, అతడు పార్టీకి చేస్తున్న సేవ గురించి కేటీఆర్కు తెలిసింది.
టెలీకాన్ఫరెన్స్ ముగియగానే మంత్రి కేటీఆర్.. హుస్సేస్ భార్యకు ఫోన్ చేసి మాట్లాడారు. యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సమయంలోనే శనివారం తన కూతురు నబీలా పుట్టినరోజు ఉందని హుస్సేన్ భార్య ప్రస్తావించింది. వెంటనే కేటీఆర్ హుస్సేన్ కూతురు నబీలాకు ఫోన్ చేసి మాట్లాడారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు గిఫ్ట్గా ఏం కావాలని అడిగారు. అయితే చిన్నారి మాత్రం తనకు ఏ గిఫ్ట్ వద్దని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తేచాలు అదే పెద్ద గిఫ్ట్ని చెప్పింది. చిన్నారి సమాధానంతో కేటీఆర్ చలించిపోయారు. వెంటనే నబీలాకు సర్ప్రైజ్ గిఫ్ట్ పంపారు. టీఆర్ఎస్ పార్టీపట్ల కార్యకర్తలకు, వారి కుటుంబానికి ఉన్న అనుబంధానికి ఇదే నిదర్శమన్నారు కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు, వారి నిబద్దత, త్యాగాలే బలమని ప్రశంసించారు.