Mynampally Hanumantha Rao : బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా, త్వరలో కాంగ్రెస్‌లో చేరే ఛాన్స్..!

తన కుమారుడికి మెదక్ సీటు ఇవ్వాలని అడిగినా బీఆర్ఎస్ అధిష్టానం మల్కాజ్ గిరి టికెట్ మాత్రమే ఇచ్చింది. Mynampally Hanumantha Rao

Mynampally Hanumantha Rao

Mynampally Hanumantha Rao Resign : బీఆర్ఎస్ కు సీనియర్ నేత, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో రెండు టికెట్లు కేటాయించలేదని అసంతృప్తితో ఉన్న ఆయన.. పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈసారి ఎన్నికల్లో తనకు మల్కాజ్ గిరి, తన కొడుక్కి మెదక్ టికెట్లు ఇవ్వాలని మైనంపల్లి పట్టుబట్టారు. తన కుమారుడికి మెదక్ సీటు ఇవ్వాలని అడిగినా బీఆర్ఎస్ అధిష్టానం మల్కాజ్ గిరి టికెట్ మాత్రమే ఇచ్చింది. దాంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావుపైనా మైనంపల్లి హనుమంతరావు బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు.

కొంతకాలంగా పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తిగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు.. తాజాగా బీఆర్ఎస్ కు రిజైన్ చేశారు. తన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని హనుమంతరావు చెప్పారు. కారు దిగేసిన మైనంపల్లి హనుమంతరావు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది.

మల్కాజ్ గిరి ప్రజలు, కార్యకర్తల కోరిక మేరకే..
బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్న విషయాన్ని తెలుపుతూ మైనంపల్లి హనుమంతరావు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ”మల్కాజ్ గిరి ప్రజలు, కార్యకర్తలు, అనుచరుల కోరిక మేరకు రాష్ట్రంలో నలుమూలల ఉన్న నా శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఈరోజు (సెప్టెంబర్ 22) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. నేను ఏ పార్టీలో చేరబోతున్నానో త్వరలోనే తెలియజేస్తాను” అని ఆ వీడియోలో చెప్పారు మైనంపల్లి హనుమంతరావు.

”ఇంతవరకు మీరు ఎంతో సహకరించారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మరిచిపోను. మల్కాజ్ గిరి ప్రజలకు, రాష్ట్రంలోని నా శ్రేయోభిలాషులందరికీ అండగా ఉంటాను. నా ప్రాణం ఉన్నంతవరకు ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తాను. దేనికీ లొంగే ప్రసక్తే లేదు” అని ఎమ్మెల్యే మైనంపల్లి అన్నారు.

Also Read..Dubbak: దుబ్బాక బరిలో నిలుస్తున్న అభ్యర్థులెవరు.. ట్రయాంగిల్ ఫైట్ విజేత ఎవరు?

కుమారుడికి టికెట్ నిరాకరణ..
ఊహించినట్లుగానే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. మైనంపల్లి హనుమంతరావు స్వయంగా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారా? లేక బీఆర్ఎస్ ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తుందా? ఇలాంటి చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాను 115 మంది పేర్లతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లికి మరోసారి మల్కాజ్ గిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్. అయితే ఎప్పటి నుంచో తన కుమారుడు రోహిత్ రావుకి మెదక్ టికెట్ ఆశిస్తున్నారు మైనంపల్లి హనుమంతరావు. ఈసారి కచ్చితంగా మెదక్ బీఆర్ఎస్ టికెట్ తన కుమారుడికే వస్తుందని మైనంపల్లి భావించారు. ఆ రకంగానే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లారు.

హరీశ్ రావే కారణం అని..
అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లికి మరోసారి మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చిన కేసీఆర్.. మెదక్ లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డికి మరోసారి బీఆర్ఎస్ టికెట్ ఖరారు చేశారు. దీంతో మైనంపల్లి షాక్ కి గురయ్యారు. తన కొడుక్కి టికెట్ రాకపోవడంతో ఆయన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మంత్రి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ కి టికెట్ రాకపోవడానికి హరీశ్ రావే కారణం అని హనుమంతరావు ఆక్రోశం వెళ్లగక్కారు. దాంతో మైనంపల్లి బీఆర్ఎస్ ను వీడతారని వార్తలు వచ్చాయి.

కాంగ్రెస్ పార్టీ నుంచి మైనంపల్లికి స్పష్టమైన హామీ..
బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. మైనంపల్లితో ఎప్పుడూ కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. మైనంపల్లి అలా ఎందుకు మాట్లాడారు అని తెలుసుకునే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేయలేదు. దాంతో మైనంపల్లి బయటకు వెళతారా? లేక బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తారా? అనే చర్చ నడిచింది. ఇంతలోనే బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు స్వయంగా మైనంపల్లి హనుమంతరావే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక స్పష్టమైన హామీ మైనంపల్లి హనుమంతరావుకి వచ్చినట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ అభర్థిగా మైనంపల్లి హనుమంతరావు, మెదక్ నుంచి ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైంది.

Also Read..Epuri Somanna: షర్మిలకు షాక్.. బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఏపూరి సోమన్న.. కేటీఆర్‌తో..

ఎంపీగా పోటీ చేసే అవకాశం..
ఈ రెండు సీట్లు కూడా మైనంపల్లికి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. అలా కాని పక్షంలో మెదక్ బరి నుంచి మైనంపల్లి కుమారు బరిలోకి దిగుతాడని, అవసరమైతే మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి హనుమంతరావు ఎంపీగా బరిలోకి దిగే ఆప్షన్ ఉంది. దీనిపై కాంగ్రెస్ నుంచి ఆయనకు స్పష్టమైన హామీ లభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన క్లారిటీ ఈ నెలాఖరులో రానుంది.

 

ట్రెండింగ్ వార్తలు