Road Accident : వనస్థలిపురంలో ఢీకొన్న బస్సులు..కారణం ఏంటంటే

ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి ప్రయత్నించారు. బీఎన్డీ రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ దగ్గర నాగార్జున సాగర్ రహదారిపై ఓ కారు అత్యంత వేగంగా వెళుతోంది. ఒక్కసారిగా సడన్ బ్రేక్...

Road accident In Vanasthalipuram : అతి వేగంగా వెళుతున్న ఓ కారు సడెన్ గా బ్రేక్ వేయడంతో వెనుకాలే ఉన్న ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కానీ..బస్సులో ఉన్ ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ఈ ఘటన రాచకొండ ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. యాక్సిడెంట్ కావడంతో ఎల్బీనగర్ పరిధిలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆదివారం కావడంతో రద్దీ స్వల్పంగానే ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.

Read More : Constable Suspend : చిత్తూరు మహిళపై దాడి ఘటనలో కానిస్టేబుల్ సస్పెన్షన్

ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి ప్రయత్నించారు. బీఎన్డీ రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ దగ్గర నాగార్జున సాగర్ రహదారిపై ఓ కారు అత్యంత వేగంగా వెళుతోంది. ఒక్కసారిగా సడన్ బ్రేక్  వేయడంతో కారు వెనకాల ఉన్న బస్సులు ఒకదాని వెనుక ఒకటి ఢీ కొన్నాయి. బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని అంబులెన్స్ లలో స్థానిక హాస్పిటల్ కు తరలించారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరగడంతో బీఎన్డీరెడ్డి నగర్ లో రోడ్డుపై నిలిచిపోయిన బస్సులను పోలీసులు & లా అండ్ ఆర్డర్ పోలీసులు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు