Warangal : రైలు కింద పడిన మహిళను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌

హసన్పర్తి మండలం భీమారానికి చెందిన పార్వతి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో వరంగర్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. 20 మంది కుటుంబ సభ్యులు ముందుగా దిగారు.

Rescue

constable rescues woman : రన్నింగ్ ట్రైన్‌ నుంచి దిగబోతూ రైలు కింద పడిపోయిన మహిళను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడారు. వరంగల్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హసన్పర్తి మండలం భీమారానికి చెందిన పార్వతి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో వరంగర్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. 20 మంది కుటుంబ సభ్యులు ముందుగా దిగారు. పార్వతి దిగుతున్న సమయంలో రైలు కదిలి వేగం పుంజుకుంది.

Railway Police : ప్రాణాలకు తెగించి గర్భిణీని కాపాడిన కానిస్టేబుల్

దీంతో కోచ్ డోర్ వద్ద వేలాడుతూ రైలు కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చిన్నరామయ్య.. పార్వతి చేతులు పట్టుకుని ప్లాట్‌ఫారంపైకి లాగి ప్రాణాలు కాపాడారు. మహిళను కాపాడిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ను రైల్వే అధికారులు, సిబ్బంది ప్రయాణికులు అభినందించారు.

ట్రెండింగ్ వార్తలు