Surabhi Vanidevi : ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ప్రమాణ స్వీకారం

దివంగత మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కూతురు సురభి వాణీదేవి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. తన చాంబర్‌లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి.. ప్రమాణ స్వీకారం చేయించారు.

Vanidevi

graduate mlc Surabhi Vanidevi : దివంగత మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు కూతురు సురభి వాణీదేవి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం (ఆగస్టు 29, 2021) శాసనమండలిలోని తన చాంబర్‌లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి.. వాణీదేవితో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. రాజకీయ వాతావరణంలో పెరిగామని చెప్పారు.

ప్రజాసేవ చేయడానికి పదవి అక్కర్లేదని అనుకున్నా.. కానీ అధికారం ఉంటే ఎక్కువ సేవ చేయొచ్చని భావించానని పేర్కొన్నారు. తనకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేకే, మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌ నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి మార్చిలో జరిగిన ఎన్నికల్లో సురభి వాణీదేవి.. టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై విజయం సాధించారు. వాణీదేవికి 1,89,339 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 1,37,566 ఓట్లు వచ్చాయి.