MLC Kavitha : 137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బాండ్ పేపర్ల స్థాయికి పడిపోయింది : ఎమ్మెల్సీ కవిత

బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ స్థాయికి పడిపోయింది అంటూ ఎద్దేవా చేశారు.

BRS MLC Kavitha

BRS MLC Kavitha.. Congress Bond Papers : బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త డ్రామాకు తెరతీశారు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 137 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ స్థాయికి పడిపోయింది అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దామోదర రాజనరసింహా, భట్టి విక్రమార్క వంటి పెద్ద నాయకులు కూడా బాండ్ పేపర్ రాసివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత విశ్వాసం కోల్పోయిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు.

కర్నాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే డ్రామా ఆడిందని.. 223 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాశారని అన్నారు. కానీ వాటిలో ఏవీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారని విమర్శించారు.కర్ణాటకలో మహిళలకు రూ. 2 వేల పెన్షన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి హామీలను ఇంకా మొదలుపెట్టనేలేదని విమర్శించారు. యువనిధి కింద ఇస్తామన్న మొత్తాన్ని కూడా పంపిణీ చేయడం లేదని..బియ్యం పథకం కూడా అమలు చేయలేదని విమర్శించారు. అలాగే అధికారంలోకి వస్తే..మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని చెప్పి బస్సుల సంఖ్యను భారీగా తగ్గించారని ఆరోపించారు.

మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారానికి ముగింపు .. అతిక్రమిస్తే కఠిన చర్యలు : ఈసీ వార్నింగ్

కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ తో పాటు సీనియర్ నాయకులు మొత్తం ఇదే డ్రామాఆడారని ఎద్దేవా చేశారు.సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం నిరుద్యోగంలో బీజేపీ పాలనలో ఉన్న హర్యాన నెంబర్ వన్ గా ఉందని అన్నారు.అలాగే కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్థాన్ రెండో స్థానంలో ఉందని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు