Telangana BJP : రాజన్న పవర్ ఫుల్ దేవుడు, హామీలు నెరవేర్చకపోతే.. వాళ్ల సంగతి చూసుకుంటాడు

తెలంగాణ నాస్తికుల రాజ్యంగా మారుతోందా? అనే బాధ కలుగుతోందన్నారు. వేములవాడ ఆలయానికి రూ.200 కోట్లు విడుదల చేస్తానన్న మాటలు ఏమయ్యాయి అని సూటిగా ప్రశ్నించారు...

BJP Chief Bandi Sanjay Visits Vemulawada Temple : రాజన్న పవర్ ఫుల్ దేవుడు.. ఇచ్చిన హామీలను నెరవేర్చని వాళ్ల సంగతి ఆయనే చూసుకుంటాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. వేములవాడ ఆలయానికి సంబంధించిన నిధులను మరొక చోట వెచ్చిస్తున్నారని, ప్రశాంతంగా దర్శనానికి వస్తే..భక్తులకు ఇన్ని ఇబ్బందులు కలిగిస్తారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆలయంలో భక్తుల రద్దీ, సౌకర్యాలు కల్పించాలనే చిత్తశుద్ధి ఎక్కడుంది అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2022, జనవరి 24వ తేదీ సోమవారం ఆయన వేములవాడ ఆలయానికి విచ్చేసి రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ..

Read More : Govt Employees Strike : సమ్మెకు వెళితే చర్యలు.. భయపడేది లేదన్న ఉద్యోగ సంఘాలు

తెలంగాణ నాస్తికుల రాజ్యంగా మారుతోందా? అనే బాధ కలుగుతోందన్నారు. వేములవాడ ఆలయానికి రూ.200 కోట్లు విడుదల చేస్తానన్న మాటలు ఏమయ్యాయి అని సూటిగా ప్రశ్నించారు. మేడారం జాతర సమయం దగ్గరకు వస్తున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. సోమవారం ఒక్కరోజే లక్ష మంది భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. సీఎం కనీసం సమీక్ష కూడా చేయలేని స్థితిలో ఉన్నారా ? గతంలో ఇచ్చిన హామీలేమయ్యాయని మరోసారి ప్రశ్నించారు. తాను ఎంపీగా ఎన్నికైనప్పటి నుండి వేములాడ దేవస్థాన అభివృద్ధి కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను అడుగుతూనే ఉన్నానన్నారు. ప్రసాదం స్కీం కింద వేములవాడ దేవస్థానాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనది అని చెబుతున్నానన్నారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చాలని వేములవాడ రాజన్నను మనస్పూర్తిగా వేడుకుంటున్నట్లు బీజేపీ ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు.

 

ట్రెండింగ్ వార్తలు