Telangana Intermediate Board practical exams : తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 7న జరగాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBI) శనివారం ప్రకటించింది. కోవిడ్ -19 నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది. థియరీ పరీక్షల తర్వాత 2021 మే 29 నుండి జూన్ 7, 2021 వరకు నిర్వహించనుంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా, ఏప్రిల్ 7 నుండి ఏప్రిల్ 20 వరకు జరగాల్సిన సాధారణ వృత్తిపరమైన కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
థియరీ పరీక్షల తరువాత ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నట్టు టీఎస్బీఐ కమిషనర్, కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ చెప్పారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి హాల్ టిక్కెట్లు, బ్యాచ్లు, టైమ్టేబుల్ ను త్వరలో తెలియజేస్తామని చెప్పారు. మార్చి 30న, ఫిజికల్ ఎగ్జామ్ లకు బదులుగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను ‘ఇంటి నుంచి పూర్తి చేసేలా నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది.
సంబంధిత జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్కు పోస్ట్, మెయిల్ ద్వారా పిడిఎఫ్ ఫార్మాట్లో అసైన్మెంట్లు పంపాలని లేదా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 20 మధ్య కళాశాలలో నేరుగా సమర్పించాలని విద్యార్థులను కోరారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (థియరీ ఎగ్జామ్స్) మే 1 నుంచి మే 20 మధ్య జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం, మార్చిలో పరీక్షలు నిర్వహిస్తారు. అయితే, మహమ్మారి పరీక్షల కారణంగా సుమారు రెండు నెలల వరకు వాయిదా పడింది.