Hyd Metro
Telangana Lockdown Extension : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా కట్టడికి టి.సర్కార్..20 గంటల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. 2021, మే 30వ తేదీ ఆదివారంతో లాక్డౌన్ గడువు ముగియనుంది. ఈ క్రమంలో..తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. లాక్ డౌన్ జూన్ 10వ తేదీ వరకు పొడిగించనున్నట్లు, మయంలో సడలింపులు ఇస్తున్నట్లు కేబినెట్ వెల్లడించింది.
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్డౌన్ నుంచి అన్నింటికి మినహాయింపు ఇచ్చింది. మరో గంట అదనపు సమయాన్ని ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు, వ్యాపారులు తమ ఇళ్లకు చేరుకోవడానికి వీలుకల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో…హైదరాబాద్ లో మెట్రో రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. లాక్డౌన్ రిలాక్సేషన్ సమయాన్ని పెంచడంతో.. మెట్రో అధికారులు సైతం మెట్రో సర్వీసు వేళల్లో మార్పులు చేశారు. 2021, మే 31వ తేదీ సోమవారం నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ట్రైన్స్ నడవనున్నాయి. హైదరాబాద్లోని మూడు కారిడార్లలోని స్టేషన్లలో 11 గంటల 45 నిమిషాలకే చివరి ట్రైన్లు ప్రారంభమై.. 12 గంటల 45 నిమిషాలకు గమ్యస్థానాలకు చేరుకోన్నాయి.
Read More : Bengal Chief Secretary : మోడీ వర్సెస్ దీదీ..తారాస్థాయికి సీఎస్ వివాదం