Telangana Municipal Elections: తెలంగాణలో మున్సిపల్స్ ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 11న సాయంత్రం 5 వరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో మద్యం షాపులతో పాటు కల్లు దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఆ రోజున కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేస్తారు.
Also Read: Harish Rao: ఆ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం: హరీశ్ రావు
ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో అన్ని పార్టీల కీలక నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడిపారు. సమయం ముగియడంతో ఇక పోలింగ్ ముగిసే వరకు సభలు, ర్యాలీలు వంటివి నిర్వహించరాదని అధికారులు తెలిపారు.
ఈ నెల 11న ఉదయం 7 నుంచి ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగుతుంది. 2,996 వార్డుల్లో 12,993 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 52 లక్షల మందిపైగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. మహిళా ఓటర్లు 26 లక్షలు, పురుష ఓటర్లు 25 లక్షల మంది ఉన్నారు.
మరిన్ని అంశాలు