Telangana Covid Cases : తెలంగాణలో కొత్తగా 164 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు(Telangana Covid Cases) భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో..

Telangana Covid Cases : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 31వేల 303 కరోనా పరీక్షలు నిర్వహించగా 164 మందికి పాజిటివ్ గా(Telangana Covid Cases) నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 61 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. అదే సయయంలో 385 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజులో మరణాలేవీ సంభవించ లేదు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 7,89,401 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,82,904 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 2వేల 386 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ తో 4వేల 111 మంది మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 154 కరోనా కేసులు నమోదయ్యాయి.

Covid-19 Fourth Wave: జూన్ లో కరోనా నాలుగో వేవ్ ఉంటుందన్న ఐఐటీ కాన్పూర్ అధ్యయనం

అటు దేశంలోనూ కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. మరోసారి కోవిడ్ కొత్త కేసులు 6వేలకు దిగొచ్చాయి. బుధవారం 8 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 6వేల 561 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కొత్త కేసులు మూడు నెలల కనిష్ఠానికి తగ్గిపోయాయి. పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువకు చేరింది. కరోనా మరణాలు కూడా భారీగా తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 142 మంది కోవిడ్ తో చనిపోయారు. ముందురోజు ఆ సంఖ్య 223గా ఉంది. ఇప్పటి వరకూ 4.29 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.14 లక్షల మంది మరణించారు.

నిన్న 14,947 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. నిన్నటి వరకూ రికవరీల సంఖ్య 4.23 కోట్లు దాటింది. మొత్తం కేసుల్లో 98.62 శాతం మంది మహమ్మారిని జయించారు. మహమ్మారి వ్యాప్తి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసులు 77 వేలకు పడిపోయాయి. యాక్టివ్ కేసుల రేటు రెండు శాతం దిగువకు చేరి 0.18 శాతంగా నమోదైంది. నిన్న 21.8 లక్షల మంది టీకా తీసుకోగా..ఇప్పటివరకూ 178 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Telangana Corona: తెలంగాణలో కొత్తగా 154 కరోనా కేసులు

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. కేసులు దిగివస్తున్నాయి. ఇక కరోనా మహమ్మారి పీడ వదిలినట్టే అని జనాలు రిలాక్స్ అవుతున్నారు. ఇంతలోనే కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు బాంబు పేల్చారు. వచ్చే జూన్‌లో భారత్‌లో కొవిడ్‌ ఫోర్త్ వేవ్‌ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 24 వరకు ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్లు, బూస్టర్‌ డోసుల ప్రభావం ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు