అమెరికాలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం.. చివరిసారిగా తండ్రితో మాట్లాడి..

Hanamkonda: చివరిసారిగా రూపేశ్‌తో అతడి తండ్రి ఈ నెల 2న మధ్యాహ్నం వాట్సప్ కాల్లో మాట్లాడారు.

అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేశ్ చంద్ర వారం రోజులుగా కనిపించడం లేదు. చికాగోలో విస్కాన్సిన్​లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్​ చదువుతున్న రూపేశ్ ఈ నెల 2 నుంచి కనపడడం లేదు.

చివరిసారిగా రూపేశ్ తో అతడి తండ్రి ఈ నెల 2న మధ్యాహ్నం వాట్సప్ కాల్లో మాట్లాడారు. అనంతరం అతని ఫోన్ స్విచ్ఛాప్‌లోకి వెళ్లిపోయిందని తండ్రి తెలిపారు. కుటుంబ సభ్యులు అతని రూమ్మేట్స్‌తో మాట్లాడారు. ఎవరినో కలవడానికి వెళ్లాడని వారు ఎవరో తమకు తెలియదని రూపేశ్ స్నేహితులు బదులిచ్చారు.

రూపేశ్ చంద్ర అదృశ్యమైనట్లు చికాగో పోలీసులకు సమాచారం అందించారు అతడి తల్లిదండ్రులు. అమెరికా ఎంబసీని కూడా సంప్రదించారు. అమెరికాలో తెలుగు విద్యార్థులు అదృశ్యమైన ఘటనలు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయి.

Also Read: తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలను గెలవబోతున్నాం: కిషన్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు