Temperature increase next 2 days in Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణం పొడిగా ఉండి సాధారణం కన్నా 2,3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతనమోదవతుందని అధికారులు చెప్పారు.
ఇక దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. దర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరట్వాడా, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది.