TS TET 2022: రేపు టెట్ పరీక్ష.. అభ్యర్థులు ఈ ఐదు అంశాలు తప్పనిసరిగా పాటించాలి
రేపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరగనుంది. పేపర్ -1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- Harish Thanniru
- Published on- June 11, 2022 / 10:52 AM IST
Ts Tet
TS TET 2022: రేపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జరగనుంది. పేపర్ -1కు 3,51,468 మంది, పేపర్-2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా హైదరాబాద్ లో 212 పరీక్ష కేంద్రాలున్నాయి. రాజధానిలో మొత్తం 50,600 మంది పరీక్షలు రాయనుండగా, ములుగు జిల్లాలో అతితక్కువగా 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో 2,200 మంది పరీక్షలు రాయనున్నారు.
TET Certificate Validity: గుడ్న్యూస్.. టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ జీవితకాలానికి పొడిగింపు
– టెట్ పరీక్ష పేపర్-1 ఉదయం 9.30 నుంచి మధ్నాహ్నం 12గంటల వరకు జరుగుతుంది.
– పేపర్ -2 పరీక్ష మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది.
– అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్ లోకి అనుమతించరు.
– ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు పరీక్ష హాల్ లోకి అనుమతించరు.
– ఓఎంఆర్ షీట్ పై సర్కిల్స్ నిపేందుకు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను ఉపయోగించాలి. ఓఎంఆర్ షీట్ ను ముడవటం, చించడం చేయకూడదు. అలా చేయడం వల్ల కంప్యూటర్ మార్కులను తీసుకునే అవకాశం ఉండదు.
– హాల్ టికెట్లపై అభ్యర్థి, అధికారుల సంతకం, అభ్యర్థి ఫొటో లేకపోతే గెజిటెడ్ అధికారి సమక్షంలో ఫొటో అంటించి, ధ్రువీకరణ తీసుకొని, డీఈవో ద్వారా అనుమతి పొందాలి.
– పరీక్ష ముగిసే వరకూ అభ్యర్థులంతా పరీక్షా హాల్లోనే ఉండాలని, మధ్యలో బయటికి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు.
