Telangana : ఏపీ ఉద్యోగుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఏపీ ఉద్యోగుల శాశ్వత బదిలీకి అభ్యంతరం లేదని సర్క్యులర్ జారీ చేశారు.
- bheemraj
- Published On : September 29, 2021 / 08:41 PM IST
Ts Govt
Andhra Pradesh employees transfer : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఏపీ ఉద్యోగుల శాశ్వత బదిలీకి అభ్యంతరం లేదని సర్క్యులర్ జారీ చేశారు. ఏపీకి వెళ్లాలనుకునే వారు అక్టోబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.
ఏపీ ప్రభుత్వం నుంచి అంగీకారం రాగానే రిజిస్ట్రార్ ద్వారా రిలీవ్ చేయనున్నారు. ఉపశమనం పొందిన తర్వాత బదిలీ శాశ్వతంగా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగులను మళ్లీ వెనక్కి తీసుకోబడదని తెలిపింది.
