Tragedy in Singareni mine : సింగరేణి గనిలో విషాదం..పైకప్పు కూలి ఇద్దరు కార్మికులు మృతి
భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి గనిలో విషాదం నెలకొంది. కేటీకే ఆరో గనిలో పైకప్పు కూలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
- bheemraj
- Updated on- April 7, 2021 / 09:50 PM IST
dead body
Two workers killed in Singareni mine : భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి గనిలో విషాదం నెలకొంది. కేటీకే ఆరో గనిలో పైకప్పు కూలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులు శంకరయ్య, నరసయ్యగా గుర్తించారు.
ఆరో గనిలో శంకరయ్య, నరసయ్య అనే ఇద్దర కార్మికులు సపోర్టు మెన్స్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో వారిద్దరూ అందులో ఇరుక్కుపోయారు.
ఇద్దరు కార్మికులు మృతి చెందినట్లుగా సింగరేణి అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలంలో రెస్క్యూ టీం సహాయ చర్యలు చేపట్టింది.
