BJP Janagarjana Sabha at Adilabad
BJP Janagarjana Sabha at Adilabad : తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా తెలంగాణలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు..డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి అంటూ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మోదీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన సమయం ఇదేనన్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా విమర్శలు సంధించారు.
కేసీఆర్ 10 ఏళ్లలో కేటీఆర్ ని సీఎం చేయాలనే ఆలోచనలోనే గడిపేశారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోలేదంటూ విమర్శించారు. తెలంగాణ భూమి ఆంగ్లేయులు, నిజంపై పోరాటం చేసింది ..తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారికంలోకి రాగానే 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.కేంద్ర ట్రైబల్ యూనివర్సిటీ ఆలస్యానికి రాష్ట్రం నిధులు కేటాయించక పోవడమే కారణమని ఆరోపించారు.పసుపుబోర్డు ద్వారా ఎగుమతులు పెరగనున్నాయని..కృష్ణ ట్రిబ్యునల్ ద్వారా మోడీ తెలంగాణ ప్రజల నీటి సమస్యను తీర్చారని తెలిపారు.33శాతం మహిళా రిజర్వేషన్లు చేసిన ఘనత మోడీది అంటూ ప్రశంసించారు. 10 ఏళ్లలో కేసీఆర్ రైతులు, దళితులు, ఆదివాసీలు, పేదల కోసం ఎం చేయలేదు..? అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ, కేంద్రమంత్రుల వరుస పర్యటనలు..
కేసీఆర్ 10ఏళ్లలో కేటీఆర్ ని సీఎం చేయాలనే ఆలోచనలోనే గడిపేశారు అంటూ ఎద్దేవా చేశారు.పేదలు వెనకబడిన వర్గాల అభివృధ్ధి కోసమే మోడీ పాటు పడుతున్నారని..దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళైనా ఆదివాసీ రాష్ట్రపతి కాలేదు, ఒక పేద మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపిది అంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు, అవినీతి, నిరుద్యోగం తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని..కేసీఆర్ కార్ స్టీరింగ్ ఒవైసీ దగ్గర ఉందని ఆరోపించారు.ఎంఐఎం అడుగుజాడల్లో నడిచే బి.ఆర్.ఎస్ ను కూకటి వేళ్ళతో పెకిలించాలి అంటూ పిలుపునిచ్చారు.దళితులకు మూడు ఎకరాలు, దళితబంధు ఏమైంది కేసీఆర్ అంటూ ప్రశ్నించారు.ఎన్నికలు రాగానే కొత్త బట్టలు వేసుకొని కాంగ్రెస్ నేతలు వస్తారు..అంటూ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ 24వేల కోట్ల బడ్జెట్ ఆదివాసీలకు కేటాయిస్తే.. మోడీ ప్రభుత్వం లక్ష 24వేల కోట్లు కేటాయించిందని..రూ.12లక్షల కోట్ల కుంభకోణం యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగింది
అంటూ విమర్శించారు.కశ్మీర్ లో ఆర్టికల్ 370ను ఎత్తేసి దేశంలో అంతర్భాగం చేసిన ఘనత మోడీది..స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి అయోధ్య రామ మందిరం అంశాన్ని కాంగ్రెస్ నాన్చుతూ వచ్చిందని..కానీ బీజేపీ ప్రభుత్వం దాన్ని సాధ్యం చేసిందనన్నారు. 2024లో జనవరిలో భవ్య రామమందిరాన్ని పారంభిస్తామని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్తాన్ లోకి చొరబడి సరిహద్దును బలోపేతం చేసింది బీజేపీ ప్రభుత్వమని అన్నారు.
కరోనా కష్టకాలంలో ఉచితంగా రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోడీదన్నారు.జి20 సదస్సులో ప్రధాని మోదీని విదేశీ నేతలంతా ప్రశంసించారు అంటూ గుర్తు చేశారు.తెలంగాణ ప్రజల ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది దాని కోసం బీజేపీని అధికారలోకి తేవాలని పిలుపునిచ్చారు.