YS Sharmila : తెలంగాణలో 40వేల మంది బాలికలు, మహిళలు మిస్సింగ్- సీఎం కేసీఆర్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ బిడ్డకు ఉన్న రక్షణ.. తెలంగాణ ఆడబిడ్డలకు లేదు. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం మీదున్న శ్రద్ధలో ఒక శాతం కూడా ఆడబిడ్డల రక్షణ మీద లేదు. YS Sharmila

YS Sharmila(Photo : Google)

YS Sharmila – CM KCR : తెలంగాణలో 30వేల మంది బాలికలు, మహిళలు (Girls, Women Missing) మిస్సింగ్ అయినట్లు కేంద్రం చెప్పిన లెక్కలు దుమారం రేపుతున్నాయి. అమ్మాయిల అదృశ్యం వ్యవహారం రాజకీయాల్లో హీట్ పెంచింది. ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆడపిల్లల అదృశ్యం అంశంపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ పై ఆమె నిప్పులు చెరిగారు.

దొర తాలిబాన్ పాలనలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణే లేదని షర్మిల వాపోయారు. ఆడపిల్లలు కంటికి కనపడకుండా పోతున్నా పట్టింపే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ ఆడే పవిత్ర గడ్డపై మహిళలు మాయం అవుతుంటే దొర ఫామ్ హౌజ్ లో మొద్దు నిద్ర పోతున్నారు అని విమర్శించారు.

Also Read..YS Sharmila: వైఎస్ షర్మిల బాణం కాంగ్రెస్ చేతికి చిక్కిందా.. అందుకే సికింద్రాబాద్ సీట్‌పై కన్నేశారా?

రాష్ట్రంలో రెండేళ్లలో 34వేల 495 మంది మహిళలు.. 8వేల 66 మంది అమాయక బాలికలు కనిపించకుండా పోయారంటే.. కేసీఆర్(CM KCR) తలదించుకోవాలన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట అని చెప్పుకున్నందుకు సిగ్గుపడాలన్నారు.

”ఆడవారి పట్ల వివక్ష చూపే మీ బందిపోట్ల పాలనలో కనీసం మిస్సింగ్ కేసులు నమోదైనా దర్యాప్తు శూన్యం. కేసీఆర్ బిడ్డకు ఉన్న రక్షణ.. తెలంగాణ ఆడబిడ్డలకు లేదు. దేశంలోనే నెంబర్ 1 అని చెప్పే తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ.. మహిళలు మాయం అవుతుంటే దొరకు ఊడిగం చేస్తోంది. పసిగట్టాల్సిన నిఘా వ్యవస్థ దొర లెక్కనే నిద్ర పోతుంది. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం మీదున్న శ్రద్ధలో ఒక శాతం కూడా ఆడబిడ్డల రక్షణ మీద లేదు.

Also Read..Andhra Pradesh: బాలికలు, మహిళల మిస్సింగ్‌పై సంచలన విషయాలు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

దొరకు ఏ మాత్రం మహిళలపై గౌరవం ఉన్నా వెంటనే మిస్సింగ్ కేసులపై దర్యాప్తు కమిటీ వేయాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది. తక్షణం తప్పిపోయిన మహిళలు, బాలికల ఆచూకీ కనిపెట్టండి” అని డిమాండ్ చేశారు షర్మిల.