TS Govt : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు.. రూ.150కోట్లు వెంటనే చెల్లించాలని వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు పంపింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దారిమళ్లించిన రూ.152కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది.

center Govt notices to telangana government

TS Govt : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు పంపింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దారిమళ్లించిన రూ.152కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. రెండు రోజుల్లో నిధులు చెల్లించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేకపోతే తదుపరి వాయిదాలు నిలిపివేస్తామని కేంద్రం తెలిపింది. గత జూన్ నెలలో తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించింది. ఈ పర్యటలో తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ పతకంలో అవకతవకలకు పాల్పడినట్లుగా గుర్తించింది. దీంతో తెలంగాణకు నోటీసులు జారీ చేసింది.