ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆకస్మికంగా పర్యటించారు.
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆకస్మికంగా పర్యటించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి ఆయన పర్యటించారు. రాజధాని నిర్మాణ ప్రాంతాలను కుటుంబ సభ్యులకు చూపించారు. అలాగే హైకోర్టు నిర్మాణ ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీంలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేలడు నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు కృష్ణా జిల్లా కొమరవోలు వెళ్లనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.