కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందో అని ప్రజలు భయపడి ఛస్తుంటే..కొందరు కరోనా బాధితులు మాత్రం క్వారంటైన్ సెంటర్లో ఆడుతూ పాడుతూ ఉల్లసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. జోకులేసుకుంటూ..ఎవరి టాలెంట్ వారు చూపించుకుంటున్నారు. క్వారంటైన్ సెంటర్లలో కొత్త కొత్త స్నేహితుల్ని సంపాదించుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన అస్సాంలోని డిబ్రుగఢ్ లో ఉన్న ఓ క్వారంటైన్ సెంటర్లో ఓ కరోనా బాధితుడు తన టాలెంట్ ను చూపించాడు. వేణువుతో మురళీగానం వినిపించాడు. వినసొంపైన ఆ వేణుగానానికి తోటి కరోనా బాధితులంతా ఈలలు వేస్తూ..చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు.
కరోనా వైరస్ సోకి కుటుంబానికి దూరంగా క్వారంటైన్ సెంటర్ లో ఉంటున్న ఓ బాధితుడు పిల్లనగ్రోవి వాయిస్తూ మిగతా బాధితులకు వినోదం కల్పిస్తున్నాడు. సదరు బాధితుడు పిల్లన గ్రోవి వాయిస్తుంటే మిగతా కరోనా వైరస్ బాధితులంతా అలనాడు గోకులంలో శ్రీకృష్ణుడు తన వేణుగానంతో గోపికలను..గోవులను..తోటి గోపారులను మైమరపించాడు. ఈనాటీ ఈకరోనా బాధితుడు మాత్రం ఆ వేణుగానానికి తోటి బాధితులను అలరించాడు. తన్మయత్వంతో నృత్యం చేయించాడు. దీనిని గమనించిన డాక్టర్లు ఇలాంటి కార్యక్రమాలు బాధితుల్లో ఆత్మ విశ్వాసం నింపుతాయని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH Coronavirus patients dance and sing at a quarantine centre in Dibrugarh, Assam. (23.07.20) pic.twitter.com/SBjtIrSdks
— ANI (@ANI) July 24, 2020