జగన్ 135 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు :  మోహన్ బాబు

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 135  సీట్లు గెలుచుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని  సినీ నటుడు, వైసీపీ నాయకుడు, మోహన్ బాబు చెప్పారు.

  • Publish Date - April 1, 2019 / 06:00 AM IST

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 135  సీట్లు గెలుచుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని  సినీ నటుడు, వైసీపీ నాయకుడు, మోహన్ బాబు చెప్పారు.

మంగళగిరి:  త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 135  సీట్లు గెలుచుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని  సినీ నటుడు, వైసీపీ నాయకుడు, మోహన్ బాబు చెప్పారు.  గుంటూరు జిల్లా మంగళగిరి నియోజక వర్గంలో వైసీపీ అభ్యర్ధి ఆళ్శ రామకృష్ణారెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే రక్తం తాగేస్తాడని  ఓటర్లను హెచ్చరించారు.
Read Also : మే 23 తర్వాత : కేంద్రంలో కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం

చంద్రబాబుకు నిలువెల్లా విషమేనని, ఎన్టీఆర్ కుటుంబాన్ని తొక్కి పారేశాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నీతి మంతుడైతే వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తాడని ప్రశ్నించారు. చంద్రబాబు గెలిస్తే 6 టీవీ ఛానల్స్, భుకబ్జా దారులు, ఇసుక, మట్టి మాఫియా బాగుపడుతుందే తప్ప ఇంకెవ్వరూ బాగుపడరని మోహన్ బాబు తెలిపారు.

చంద్రబాబుపై ఉన్న 11 కేసులను ఎవరికీ తెలియకుండా దాచిపెట్టారని,  ఊసర వెల్లిలా రంగులు మారుస్తాడని ఆయన చెప్పారు. చంద్రబాబు దుర్మార్గం గురించి ఎన్టీఆరే చెప్పారని, ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన వ్యక్తి చంద్రబాబే అని మోహన్ బాబు చెపుతూ…చంద్రబాబు  చివరి దశకు వచ్చాడని ఆయన చేసిన అకృత్యాలు దేవుడు చూస్తున్నాడని అన్నారు. నాపై చేసిన ఆరోపణలపై  ఎక్కడైనా చర్చకు సిధ్దమని సవాల్ విసిరానని ఇంతవరకూ దానికి సమాధానం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్లీ మోసపోతారు కనుక ఒకసారి జగన్ మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. 
Read Also : మోడీ చేతిలో టీఆర్ఎస్ కీలుబొమ్మ : జహీరాబాద్ లో రాహుల్