ఈవీఎంలతోనే నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలు : సీఈసీ

  • Publish Date - March 31, 2019 / 03:51 PM IST

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలపై ఉత్కంఠ వీడింది. ఈవీఎంలతోనే నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికలు జరపాలని సీఈసీ ఆదేశించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ఈసీకి కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లను సరఫరా చేయాలని ఈసీఐఎల్‌కు ఆదేశించింది. 26 వేల 820 బ్యాలెట్ యూనిట్లను సప్లై చేయాలని ఈసీఐఎల్ కు సీఈసీ ఆదేశించింది. 2వేల 6 వీవీప్యాట్ లు సప్లై చేయాలని ఆదేశించింది. బేల్ ఎం-3 ఈవీఎంలను ఈసీఐఎల్ సరఫరా చేయనుంది. నిజామాబాద్‌ లోక్‌సభ పరిధిలో 185 మంది అభ్యర్థులు  బరిలో నిలిచారు.